జగిత్యాల: జగిత్యాల రూరల్ మండలంలో శనివారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం కలుగుతుందని ఏఏఈ సుందర్ తెలిపారు. మధ్యాహ్నం 3.30 గంటల నుంచి 5 గం టల వరకు కల్లెడ, తక్కళ్లపల్లి, సోమనపల్లి, సంగంపల్లి, హబ్సీపూర్, గుట్రాజ్పల్లి, అనంతారం, లక్ష్మీపూర్, జాబితాపూర్, ధర్మారం, తిమ్మాపూర్ గ్రామాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు పేర్కొన్నారు. వినియోగదారులు గమనించి సహకరించాలన్నారు.