హన్మకొండ: కూరగాయల సాగుకు రాయితీ అందిస్తున్నట్లు పరకాల డివిజన్ ఉద్యాన అధికారి మధులిక ఒక ప్రకటనలో తెలిపారు. క్యాలీఫ్లవర్, టమాటా, క్యాబేజీ, పచ్చిమిర్చి నారు 100 శాతం రాయితీపై అందుబాటులో ఉన్నట్లు చెప్పారు. తీగ జాతి కూరగాయల సాగులో శాశ్వత పందిళ్లు వేసుకునేందుకు 50 శాతం రాయితీ అందిస్తున్నామని అన్నారు. పూర్తి వివరాలకు 8977714069 నెంబర్ను సంప్రదించాలన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.