హన్మకొండ: వడ్డేపల్లి, కలెక్టరేట్ సబ్ స్టేషన్ల పరిధిలో సోమవారం విద్యుత్తు సరఫరాలో అంతరాయం ఉంటుందని ఎన్పీడీసీఎల్ హన్మకొండ టౌన్ డీఈ సాంబరెడ్డి తెలిపారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు సబ్ స్టేషన్ల పరిధిలో సరఫరా నిలిపివేయనున్నట్లు తెలిపారు. అలాగే ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కాకతీయ విశ్వవిద్యాలయం సబ్స్టేషన్ పరిధిలో అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. వ్యాపారులు, వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.