సంగారెడ్డి: కంగ్టిలో ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు కార్యక్రమాన్ని శుక్రవారం ఏఈవో స్వాతి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమాన్ని ఏడీఏ నూతన్ కుమార్ తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఫార్మర్ రిజిస్ట్రేషన్ నమోదు ప్రతి రైతు తప్పనిసరి చేసుకోవాలని అన్నారు. కేంద్ర పథకాలు పొందాలంటే తప్పనిసరిగా 11 అంకెలతో కూడిన ఫార్మర్ ఐడి ఉండాలని అవగాహన కల్పించారు.