మెదక్: రామాయంపేట మున్సిపాలిటీ పరిధిలో దోమల నివారణకు మున్సిపల్ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలకుండా గురువారం మున్సిపాలిటీ పరిధిలోని 2, 7వ వార్డుల్లో దోమల మందు పాగింగ్ చేశారు. అనంతరం దోమల నివారణపై ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పలువురు మున్సిపల్ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.