ఖమ్మం: రైలు కిందపడి ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన బుధవారం మధిరలో వెలుగుచూసింది. మధిర మున్సిపాలిటీలో బిల్ కలెక్టర్గా పని చేస్తున్న అనిల్ (30) స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.