భద్రాద్రి కొత్తగూడెం: భద్రాచలం ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట బుధవారం AITUC, CITU, TUCI నాయకుల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కేంద్రం ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను, రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న పని గంటల పెంపు నిర్ణయాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ధర్నాలో పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొన్నారు.