ములుగు: మందుపాతర పేలి వృద్ధుడికి గాయాలైన ఘటన శుక్రవారం వెంకటాపురం మండలం ముక్కునూరుగుట్టపై చోటుచేసుకుంది. కంకబొంగుల కోసం గుట్టపైకి వెళ్లిన సోయం కామయ్య అనే వృద్ధుడు ప్రమాదవశాత్తు మందుపాతరపై కాలు వేశాడు. అది పేలి తీవ్రంగా గాయపడ్డాడు. గ్రామస్థుల సహాయంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించారు.