హన్మకొండ: గురుకులాల కార్యదర్శి డీఎస్ వెంకన్నను బుధవారం గిరిజన విద్యార్థి సంఘాల నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఆయనకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా ట్రైబల్ వెల్ఫేర్ గురుకులాల్లో అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి సీటు ఇవ్వాలని కోరినట్లు తెలిపారు. ప్రతివిద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేలా చర్యలు చేపట్టాలని అన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యార్థి సంఘం నాయకులు పాల్గొన్నారు.