ఆదిలాబాద్: తాంసీ మండలంలో కురిసిన భారీ వర్షాలకు నీట మునిగిన పంట పొలాలను మంగళవారం మండల వ్యవసాయ అధికారి రవీందర్ పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వరదలకు నష్టపోయిన పంటలను ప్రాథమిక సర్వే నిర్వహించి ప్రభుత్వానికి నివేదిక అందజేస్తామని తెలిపారు. సర్వే కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారితో పాటు మాజీ సర్పంచ్ రత్న ప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.