కొమురం భీమ్: జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ఎస్సై దుర్గం రాజయ్య పదవి విరమణ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ఎస్పీ కాంతిలాల్ పాటిల్ పాల్గొని ఆయనను సన్మానించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాజయ్య తన సర్వీస్ మొత్తంలో ఎలాంటి రిమార్కు లేకుండా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయికి చేరుకున్నారని అన్నారు. కార్యక్రమంలో జిల్లా పోలీస్ సంఘం అధ్యక్షులు విజయ శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.