మెదక్: ప్రజా సమస్యల పరిష్కారం కోసమే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని రామాయంపేట తహసీల్దార్ రజనీకుమారి తెలిపారు. సోమవారం ఎమ్మార్వో కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. గ్రామాల్లో ప్రభుత్వం పంపిణీ చేసిన బీడీ కార్మికుల ప్లాట్లు అక్రమంగా విక్రయాలు చేస్తున్నారని యాదవ సంఘం సభ్యులు ఫిర్యాదు చేశారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.