సంగారెడ్డి: ఐడిఏ బొల్లారం మున్సిపల్ పాత బస్తిలో సోమవారం జనసంఘ్ వ్యవస్థపాకుడు డా.శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు పాల్గొని మొక్కలు నాటారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సమైక్య భారతం కోసం ప్రాణాలను తృణప్రాయంగా త్యజించిన వ్యక్తి శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ అని కొనియాడారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు రవీందర్రెడ్డి, మేఘన రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.