పెద్దపల్లి: మంథని విద్యార్థి యువత కార్యాలయంలో గురువారం సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యుడు బూడిద గణేష్ అధ్యక్షతన కార్మిక సంఘాల జేఏసీ సమావేశం నిర్వహించారు. సమావేశంలో పలువురు నాయకులు పాల్గొని మాట్లాడుతూ.. జూలై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు ముత్యంరావు, రాజేందర్, ఆకుల వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.