పెద్దపల్లి: కలెక్టరేట్ సమావేశ మందిరంలో మంగళవారం స్వశక్తి మహిళా సంఘాల సభ్యులకు ర్యాంప్ ప్రాజెక్టుపై ఒక్కరోజు అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా డీఆర్డీవో కాళిందిని పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మహిళలు ఆర్థికంగా బలోపేతం కావాలని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలకు అందించే ఏకరూప దుస్తులు కుట్టెందుకు ఒక్కోమహిళా సభ్యురాలిపై రోజుకు రూ.200 ఖర్చు చేస్తూ 10 రోజులు ప్రత్యేక శిక్షణ అందించామని తెలిపారు.