Author: Shivaganesh

  • ఆందోళన చేసిన రైతులు

    మహబూబాబాద్: విద్యుదాఘాతంతో మూగజీవాలు మృతి చెందిన ఘటన సోమవారం సీరోలు మండలం తాళ్లసంకీస శివారు పొలాల్లో చోటుచేసుకుంది. గ్రామ శివారు పొలాల్లో విద్యుదాఘాతంతో ఐదు ఆవులు, ఒక ఎద్దు మృతి చెందాయి. దీంతో కురవి – ఖమ్మం ప్రధాన రహదారిపై బాధిత రైతులు తమకు న్యాయం చేయాలని నిరసన చేశారు. నిరసనకారులతో ఎస్సై నగేష్ మాట్లాడి వారిని శాంతింపజేశారు.

     

  • అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపనలు

    పెద్దపల్లి: పెద్దపల్లి మండలం నిట్టూరులో రూ.15 లక్షలతో సీసీ రోడ్లు, రూ.12 లక్షలతో అంగన్‌వాడీ భవనం, తుర్కలమద్దికుంటలో రూ.29 లక్షలతో పలు అభివృద్ధి పనులకు సోమవారం ఎమ్మెల్యే సిహెచ్ విజయరమణారావు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడపడానికి అనునిత్యం కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు నాయకులు, అధికారులు పాల్గొన్నారు.

  • ‘పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తాం’

    నిర్మల్: బాసర గోదావరి ఘాట్ వద్ద ఆదివారం జరిగిన ఘటన పునరావృతం కాకుండా జాగ్రత్త వహిస్తామని ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. సోమవారం ఆమె ఘటన స్థలాన్ని పరిశీలించి మాట్లాడారు. ఆదివారం జరిగిన సంఘటన తనను ఎంతో కలిసివేసిందని ఇలాంటి సంఘటనలు మరోసారి జరగకుండా జాగ్రత్త వహిస్తామని వెల్లడించారు. పుష్కర స్నానాల వద్ద భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు.

     

  • ‘గజ ఈతగాళ్లు ఉండేలా చూడాలి’

    నిర్మల్: బాసర గోదావరి నదిలో ఆదివారం ఐదుగురు యువకులు చనిపోయిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని ఎమ్మెల్యే పవార్ రామరావ్ పటేల్ అన్నారు. సోమవారం ఆయన గోదావరి నది వద్ద ఘటన జరిగిన స్థలాన్ని పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఘాట్ల వద్ద 24 గంటలు గజ ఈతగాళ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • బస్వాపూర్ మల్లన్న సన్నిధిలో మల్లేష్ గౌడ్

    మెదక్: వెల్దుర్తి మండలం బస్వాపూర్ గ్రామంలోని మల్లికార్జున స్వామి ఆలయాన్ని సోమవారం జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆయన స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన భక్తులతో మాట్లాడుతూ.. ఒకే దేశం ఒకే ఎన్నిక జరగడం వల్ల కలిగే లాభాల గురించి వివరించారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • భూ సమస్యలపై దరఖాస్తుల స్వీకరణ

    ములుగు: వెంకటాపురం మండల కేంద్రంలోని రెవెన్యూ కార్యాలయంలో సోమవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా రైతుల నుంచి దరఖాస్తులు తీసుకోవడానికి ప్రత్యేక కౌటర్‌ను అధికారులు ఏర్పాటు చేశారు. పలువురు  రెవెన్యూ అధికారులు మాట్లాడుతూ.. భూభారతి చట్టం ద్వారా రైతుల సమస్యలు పరిష్కారం అవుతాయన్నారు. కార్యక్రమంలో అధికారులు, రైతులు పాల్గొన్నారు.

  • రైతు నేస్తం వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం

    మహబూబాబాద్: మాల్యల గ్రామంలో సోమవారం రైతు నేస్తం కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు సాంపద్రాయక వ్యవసాయంతో పాటు ఆధునిక పద్ధతులను అలవర్చుకోవలన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే మురళీ నాయక్, పలు శాఖల అధికారులు, రైతులు పాల్గొన్నారు.

     

  • లంచం తీసుకుంటూ పట్టుబడిన డీఈఓ

    ములుగు: డీఈఓ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన ఘటన సోమవారం జిల్లాలో కలకలం సృష్టించింది. డీఈఓ కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణినితో పాటు కార్యాలయ ఉద్యోగి దిలీప్‌ కన్నాయిగూడెం మండలానికి చెందిన ఓ ప్రభుత్వ ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

     

  • ప్రజావాణి అర్జీలను స్వీకరించిన కలెక్టర్

    మహబూబాబాద్: కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో కలెక్టర్ శశాంక పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజావాణి అర్జీలను సత్వరం పరిష్కరించాలన్నారు. జూన్ 30 వరకు ఇందిరమ్మ ఇండ్ల ప్రకీయ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పథకాల అమలలో అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని సూచించారు. కార్యక్రమంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారు’

    ఆదిలాబాద్: జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం ఎస్పీ అఖిల్ మహాజన్‌ను సైబర్ నేరగాళ్ల ద్వారా మోసపోయి పోలీసుల సాయంతో తిరిగి డబ్బులను అందుకున్న బాధితులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా వారు ఎస్పీని సన్మానించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ.. ప్రజల రక్షణకై పోలీసులు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ సురేందర్రావు, సైబర్ క్రైమ్ ఇంచార్జ్ ఏసుదాస్, సిబ్బంది పాల్గొన్నారు.