యాదాద్రి భువనగిరి: చౌటుప్పల్లోని నారాయణ విద్యాసంస్థల్లో శనివారం ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. అనుమతి లేని విద్యాసంస్థలపై చర్యలు తీసుకోవాలని, విద్యా హక్కు చట్టాన్ని పటిష్ఠంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సెలవుల్లో పాఠశాలలు నడుస్తున్నాయని, కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ధర్నా చేసిన ఎస్ఎఫ్ఐ చౌటుప్పల్ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు.