నిర్మల్: జిల్లా ప్రజలు జాతీయ లోక్ అదాలత్ సద్వినియోగం చేసుకొని న్యాయ సంబంధిత సమస్యలను పరిష్కరించుకోవాలని కలెక్టర్ అభిలాష అభినవ్ తెలిపారు. శనివారం జిల్లా కేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో నిర్వహించిన లోక్ అదాలత్ కార్యక్రమంలో ఆమె, జ్యూడిషియల్ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఆమె మాట్లాడుతూ… న్యాయం కోసం కోర్టుల వద్ద వేచి చూసే అవసరం లేకుండా లోక్ అదాలత్ ద్వారా సమస్యలను పరిష్కరించుకోవాలని పిలుపునిచ్చారు.