మెదక్: నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు గురువారం పాఠ్యపుస్తకాలు, నోట్బుక్స్, ఏకరూప దుస్తులు అందజేత కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఆంజనేయులు గౌడ్ పాల్గొని విద్యార్థులకు పుస్తకాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ విద్యాసంస్థల బలోపేతానికి కృషి చేస్తుందన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.