సంగారెడ్డి: మంత్రి శ్రీహరిని గురువారం హైదరాబాద్లోని వారి నివాసంలో రాష్ట్ర సెట్విన్ కార్పొరేషన్ ఛైర్మన్ ఎన్.గిరిధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈసందర్భంగా గిరిధర్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీలో క్రమశిక్షణతో పని చేసే వారికి కచ్చితంగా గుర్తింపు ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో స్పోర్ట్స్ ఛైర్మన్ శివసేనరెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.