Author: Shivaganesh

  • ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్‌కు తీవ్రగాయాలు

    పెద్దపల్లి: ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడిన ప్రమాదంలో ఒకరికి తీవ్రగాయాలైన ఘటన బుధవారం ముత్తారం మండలం అడవి శ్రీరాంపూర్ గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ఎర్రం మొగిళి చెందిన ట్రాక్టర్‌కు అదే గ్రామానికి చెందిన గసిగంటి శీను డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. బుధవారం ఓ రైతు భూమి చదును చేస్తుండగా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ అదుపుతప్పి పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో శ్రీనుకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

  • కాళికామాతకు ప్రత్యేక పూజలు

    మెదక్: వెల్దుర్తి మండలంలోని మన్నేవార్, జలాల్పూర్ గ్రామాల్లో బుధవారం పౌర్ణమిని పురస్కరించుకొని శ్రీ కాళికా మాత అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారికి అభిషేకం, స్థానికంగా ఉన్న గోశాలలోని గోవులకు పండ్లు, బక్షాలు పెట్టినట్లు గ్రామస్థులు తెలిపారు. కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, గ్రామస్థులు, తదితరులు పాల్గొన్నారు.

  • ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’

    సంగారెడ్డి: జహీరాబాద్ మండలం కొత్తూరు గ్రామంలోని రైతు వేదికలో బుధవారం వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో భాగంగా రైతులకు ఆధునిక వ్యవసాయంపై అవగాహన కల్పించారు.  వచ్చే వానాకాలం పంట సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై వ్యవసాయ శాస్త్రవేత్తలు, అధికారులు అవగాహన కల్పించారు. పంటసాగులో మార్పిడి చేయడం వలన సుస్థిర ఆదాయం పొందేందుకు అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

  • బాధిత కుటుంబాలకు మంత్రి అడ్లూరి పరామర్శ

    పెద్దపల్లి: ధర్మారం మండలం చామనపెల్లి గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో 52 గొర్రెలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

     

  • ధర్మపురి దేవస్థానం రోజువారి ఆదాయ వివరాలు

    జగిత్యాల: ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి బుధవారం రూ.1,54,114 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్య నిర్వాహణ అధికారి సంకటాల శ్రీనివాస్ తెలిపారు. వివిధ కార్యక్రమాల టికెట్లు ద్వారా రూ.71,264 రాగా, ప్రసాదాల ద్వారా రూ.68,610, అన్నదానం ద్వారా
    రూ.14,240 వచ్చినట్లు పేర్కొన్నారు. ఏర్పాట్లను ఆలయ సిబ్బంది పర్యవేక్షించారు.

     

  • కమలాపూర్‌లో బడిబాట కార్యక్రమం

    జగిత్యాల: ధర్మపురి మండలం కమలాపూర్‌లో బుధవారం బడిబాట కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా విద్యా అధికారి రాము పాల్గొని మాట్లాడుతూ.. పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అనంతరం ప్రభుత్వ ఉపాధ్యాయుడు నూనావత్ రాజేష్ తన పిల్లలు అనిరుధ్, అన్విత, అక్షరలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. కార్యక్రమంలో మండల విద్యాధికారి సీతాలక్ష్మి, ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

  • లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేసిన మంత్రి

    జగిత్యాల: గొల్లపల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా కలెక్టర్ సత్యప్రసాద్‌తో కలిసి మంత్రి లక్ష్మణ్ కుమార్ పాల్గొన్నారు. ఈసందర్భంగా వారు లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రతి పేదింటి వారి సొంతింటి కలను నెరవేర్చాలని ప్రభుత్వం కృషి చేస్తోందని అన్నారు.

  • ‘కమిషన్ పేరుతో కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారు’

    హన్మకొండ: కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంపై ఏర్పాటు చేసిన కమిషన్‌ ముందుకి బుధవారం కేసీఆర్‌ హాజరు అయ్యారు. ఈక్రమంలో ఆయనకు మద్దతుగా హైదరాబాద్‌కు పార్టీ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌ భాస్కర్‌ పార్టీ శ్రేణులతో కలిసి వెళ్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కమిషన్‌ పేరుతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుందని విమర్శించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.

  • రెస్టారెంట్లపై అధికారుల దాడి.. 12 మందిపై కేసు నమోదు

    భద్రాద్రి కొత్తగూడెం: పాల్వంచ పట్టణంలోని పలు రెస్టారెంట్లు, హోటల్స్‌, టీ స్టాల్స్‌పై బుధవారం సివిల్ సప్ల‌య్ డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసరావు దాడి చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కమర్షియల్స్ గ్యాస్ సిలిండర్లకు బదులుగా గృహ అవసరాలకు వాడే సిలిండర్లను (డొమెస్టిక్) వాడటాన్ని గుర్తించినట్లు తెలిపారు. ఈక్రమంలో 35 గ్యాస్ సిలిండర్లను స్వాధీనం చేసుకొని, 12 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.

  • సుందరమ్మ జాతరలో పాల్గొన్న రాజిరెడ్డి

    మెదక్: హత్నుర మండల కేంద్రంలో బుధవారం శ్రీ సుందరమ్మ జాతర ఉత్సవాలు వైభవంగా జరిగాయి. జాతరలో ముఖ్యఅతిథిగా నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జి ఆవుల రాజిరెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు, పాల్గొన్నారు.