సిద్దిపేట: అక్బర్పేట భూంపల్లి మండలంలోని పోతారెడ్డిపేట గ్రామంలో బుధవారం భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు. కార్యక్రమంలో తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ.. భూభారతి చట్టంతో రైతుల సమస్యలు తీరుతాయని అన్నారు. కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు వెంకటస్వామి గౌడ్, జిల్లా కార్యదర్శి ఏలూరి కమలాకర్, రైతులు, రెవెన్యూ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.