జగిత్యాల: ధర్మపురి ఎమ్మెల్యే, మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ను బుధవారం ఆయన క్యాంపు కార్యాలయంలో జిల్లా విద్యాశాఖ అధికారి రాము మర్యాదపూర్వకంగా కలిశారు. ఈసందర్భంగా ఆయన మంత్రికి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యాశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రిని కోరినట్లు తెలిపారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.