పెద్దపల్లి: ధర్మారం మండలం చామనపెల్లి గ్రామంలో మంగళవారం విద్యుదాఘాతంతో 52 గొర్రెలు మృతి చెందాయి. విషయం తెలుసుకున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ బుధవారం కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ప్రభుత్వం నుంచి ఆర్థిక సహాయం అందించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.