మెదక్: నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని అంగన్వాడీ సెంటర్లో బుధవారం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎగ్ బిర్యాని ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్పర్సన్ సుహాసిని రెడ్డి పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కార్యక్రమాన్ని గర్భిణులు, బాలింతలు, చిన్నారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.