Author: Shivaganesh

  • ‘విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలి’

    మెదక్: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాల ద్వారా విద్యారంగాన్ని బలోపేతం చేసే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని బీసీ సంక్షేమ అధికారి జగదీష్ తెలిపారు. ఈసందర్భంగా ఆయన మెదక్‌లోని బాలికల వసతి గృహాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు అవసరమైన అన్ని సదుపాయాలు కల్పిస్తున్నామని పేర్కొన్నారు. విద్యార్థులు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

  • ‘ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ సమస్యలను పట్టించుకోవడం లేదు’

    మెదక్: రామాయంపేటలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల కళాశాలలో సమస్యలు పేరుకుపోయాయని యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు జగన్ అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హాస్టల్లో సరైన వసతులు లేకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని, అయినా ఇన్‌ఛార్జ్ ప్రిన్సిపాల్ సమస్యలను పట్టించుకోవడం లేదని అన్నారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకోవడానికి వెళ్తే తమను అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. వెంటనే సమస్యలను పరిష్కారాన్నించాలని డిమాండ్ చేశారు.

  • అధికారుల తీరుపై రైతుల ఆగ్రహం

    భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండలం అప్పారావుపేటలోని పామాయిల్ ఫ్యాక్టరీ అధికారుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. ఫ్యాక్టరీలో రెండు కంప్యూటర్ కాంటాలు ఉన్నప్పటికీ, ఒకటే వాడటంతో గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోందని వాపోయారు. దీంతో తమకు ఒక రోజంతా వృథా అవుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరారు.

  • SRSP 16 గేట్ల ఎత్తివేత

    నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఈసందర్భంగా పలువురు అధికారులు మాట్లాడుతూ.. ప్రాజెక్టులోకి 80,000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, గురువారం రాత్రి 16 గేట్లు ఎత్తి 49,280 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1090.8 అడుగుల నీటిమట్టం ఉండగా, 79.658 టీఎంసీల నీటి నిల్వ ఉందన్నారు. మొత్తం ఔట్‌ఫ్లో 78,812 క్యూసెక్కులుగా ఉందని పేర్కొంది.

     

  • రైల్వే స్టేషన్‌లో తప్పిన పెను ప్రమాదం

    వరంగల్: రైల్వే స్టేషన్‌లో పెను ప్రమాదం తప్పింది. గురువారం వరంగల్ రైల్వే స్టేషన్‌లో గూడ్స్ రైలు రివర్స్ అవుతుండగా, స్టేషన్ ముందున్న ఏటీఎం పక్క గోడను ఢీకొట్టింది. ప్రమాదంలో గోడ ధ్వంసమైంది. అదృష్టవశాత్తు ఆ సమయంలో ఎవరూ అక్కడ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

     

  • ‘కాంగ్రెస్ పాలనలో రైతులు కాళ్లు మొక్కే పరిస్థితి’

    సంగారెడ్డి: గుమ్మడిదల మండలకేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్‌రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన  మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో యూరియా కోసం రైతులు కష్టపడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు కాళ్లు మొక్కే పరిస్థితి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు.

     

  • ‘పోలీసుల అనుమతి తప్పనిసరి’

    ఖమ్మం: ముదిగొండ మండలంలో గణేష్ మండపాలు ఏర్పాటు చేయాలంటే పోలీసుల అనుమతి తప్పనిసరి అని సీఐ వడ్డేపల్లి మురళి స్పష్టం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రోడ్డుపై, ప్రజలకు ఇబ్బంది కలిగేలా మండపాలు ఏర్పాటు చేయకూడదని సూచించారు. డీజే సౌండ్‌కు అనుమతి లేదని, విద్యుత్ శాఖ అనుమతి పత్రాలు కూడా సమర్పించాలని తెలిపారు. నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

  • ప్రజల సహకారంతో అభివృద్ధి: మంత్రి పొంగులేటి

    ఖమ్మం: పాలేరు నియోజకవర్గంలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజల సహకారంతో ప్రభుత్వం రాష్ట్రంలో అభివృద్ధిని కొనసాగిస్తుందని తెలిపారు. కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇంటర్నేషనల్ స్కూళ్ల నిర్మాణం వంటి పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. ధరణి స్థానంలో భూభారతి 2025 చట్టం తీసుకొచ్చినట్లు వెల్లడించారు.

  • ‘యూరియా సరఫరాలో ప్రభుత్వం విఫలం’

    మెదక్: నర్సాపూర్‌లో యూరియా కొరతపై రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతుల సమస్యను గమనించిన ఎమ్మెల్యే సునీతా రెడ్డి వెంటనే స్పందించారు. ఈసందర్భంగా ఆమె కలెక్టర్‌తో మాట్లాడి, రెండు లారీల యూరియాను నర్సాపూర్‌కు పంపాలని కోరారు. ఒక్కో రైతుకు రెండు లేదా మూడు బస్తాలు ఇవ్వాలని వ్యవసాయ అధికారికి సూచించారు. రైతులకు సరిపడ యూరియా సరఫరాలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

  • క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే

    భద్రాద్రి కొత్తగూడెం: దమ్మపేట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం పెద్దగొల్లగూడెం క్రీడా మైదానంలో ఉమ్మడి జిల్లాల స్థాయి ఫోటోగ్రాఫర్ల క్రికెట్ టోర్నమెంట్‌ నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే జారె ఆదినారాయణ పాల్గొని పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ప్రతి ఒక్కరు క్రీడలకు ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. ఫోటోగ్రాఫర్ల సేవలను కొనియాడారు. ఇలాంటి క్రీడా పోటీలు నిర్వహించడం అభినందనీయమని అన్నారు.