Author: Shivaganesh

  • నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు

    ఆదిలాబాద్: కలెక్టరేట్‌లో సోమవారం జరగాల్సిన ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేసినట్లు కలెక్టర్ రాజర్షిషా ప్రకటించారు. జిల్లాలో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. అత్యవసరమైతే తప్పా ప్రజలు బయటకు రావద్దని సూచించారు. భారీ వర్షాలతో ఇబ్బందులు ఎదుర్కొంటే  18004251939 టోల్ ఫ్రీ నంబరుకు సంప్రదించాలని కోరారు.

  • 19న జిల్లాస్థాయి  అథ్లెటిక్స్ ఎంపిక పోటీలు

    మెదక్: తెలంగాణ రాష్ట్ర జూనియర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ 11వ పోటీల్లో భాగంగా ఈనెల 19న మెదక్ శాయ్ స్టేడియంలో జిల్లాస్థాయి ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు అథ్లె టిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మధు సూదన్ ఒక ప్రకటనలో తెలిపారు. అండర్ 14, 16, 18, 20, బాలబాలికలకు పోటీలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారు రాష్ట్రస్థాయి పోటీల్లో జిల్లా తరపున పాల్గొంటారన్నారన్నారు

  • నేడు విద్యుత్తు సరఫరాకు అంతరాయం 

    ఖమ్మం: ఖమ్మం నగరంలోని బుర్‌హాన్‌పురం ఉపకేంద్రం బస్టాండ్ ఫీడర్ పరిధిలో సోమవారం ఉదయం 9 నుంచి 11 వరకు, మామిళ్లగూడెం ఫీడర్ పరిధిలో ఉదయం 10 నుంచి 12 వరకు విద్యుత్తు సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ రవికుమార్ తెలిపారు. మరమ్మతుల కారణంగా  మామిళ్లగూడెం, బుర్హాన్ పురం, బస్ డిపో రోడ్డు, మయూరిసెంటర్ పరిసరాల్లో విద్యుత్తు సరఫరా ఉండదన్నారు. వినియోగదారులందరూ గమనించి సహకరించాలన్నారు.

     

  • 19న డీఈసెట్ స్పాట్ అడ్మిషన్లు

    ఖమ్మం: డీఈసెట్-2025 స్పాట్ అడ్మిషన్లకు షెడ్యూల్ విడుదలైనట్లు ఖమ్మం డైట్ కళాశాల ఇన్‌ఛార్జి ప్రిన్సిపాల్ బాలమురళీ ఓ ప్రకటనలో తెలిపారు. ర్యాంకు సాధించి సీటురాని అభ్యర్థులు ఈనెల 19న ఖమ్మం డైట్ కాలేజీలో నిర్వహించనున్న స్పాట్ అడ్మిషన్‌లో పాల్గొనాలన్నారు. ఖమ్మం కళాశాలలో ఇంగ్లిషు మీడియంలో ఐదు, తెలుగు మీడియంలో 8 సీట్లు ఉన్నాయని తెలిపారు.

  • నేడు ప్రజావాణి కార్యక్రమం

    వరంగల్: కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కారం కోసం సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డా.సత్యశారద ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం. 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు జరిగే కార్యక్రమంలో జిల్లా ప్రజలు వారి సమస్యలు విన్నవించుకోవచ్చన్నారు. గ్రేటర్ పరిధిలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు ప్రజావాణి ఉంటుందని కమిషనర్ చాహత్ బాజ్ పాయ్ తెలిపారు.

     

  • నేడు, రేపు స్పాట్ కౌన్సెలింగ్

    హన్మకొండ: ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు డీఈడీ కాలేజీలలో ఖాళీ సీట్ల భర్తీకి సోమ, మంగళవారాల్లో స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు హన్మకొండ డైట్ కళాశాల ప్రిన్సిపాల్ ఎండీ.అబ్దులై ఒక ప్రకటనలో తెలిపారు. తెలుగులో 3, ఆంగ్లంలో 7, ఉర్దూలో 26 సీట్లు మిగిలినట్లు చెప్పారు.  ‘డీఈఈసెట్-25’లో అర్హత సాధించి, ఇది వరకు ఏ కాలేజీలో సీటు పొందని వారు హాజరు కావాలన్నారు. వివరాలకు 90304 92595 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

     

  • ఎమ్మెల్యేకు Big Folk Night కార్యక్రమ ఆహ్వానం

    మంచిర్యాల: BIGTV ఆధ్వర్యంలో ఈనెల 23న సాయంత్రం 6 గంటలకు LB స్టేడియంలో జరిగే Big Folk Night-2025 ఆహ్వాన పత్రికను బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్‌కు స్టాఫ్ రిపోర్టర్ ఇర్ఫాన్ అందించారు. ఒకే వేదికపై తెలంగాణలోని జానపద కళాకారులు ఆట, పాటలతో అలరించనున్నారని వివరించారు. తెలంగాణ సంస్కృతి సంప్రదాయం ఉట్టిపడేలా నిర్వహిస్తున్న అతిపెద్ద తొలి జానపద పాటల కార్యక్రమం ఇదే కావడం విశేషం.

  • ‘యూరియా కొరత లేకుండా చూడాలి’

    మహబూబాబాద్: నెల్లికుదురు మండలం శ్రీరామగిరిలో యూరియా కొరత తీవ్రంగా ఉందని స్థానిక రైతులు వాపోయారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే రైతులు PACS కేంద్రాల వద్ద యూరియా కోసం బారులు తీరారు. ఈసందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ.. వారం రోజులుగా యూరియా దొరకడం లేదని అన్నారు. ఉన్నతాధికారులు స్పందించి యూరియా కోరత లేకుండా సరఫరా చేయాలని విజ్ఞప్తి చేశారు.

  • న్యాల్కల్ మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే

    సంగారెడ్డి: న్యాల్కల్ మండలంలో ఆదివారం జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు పర్యటించారు. ఈసందర్భంగా ఆయన చీకుర్తిలో భారీ వర్షాల కారణంగా పొంగిన వాగులు, దెబ్బతిన్న రోడ్డులను, పాఠశాల భవనాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. కార్యక్రమలో పలువురు మండల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

  • సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేసిన నాయకులు

    భద్రాద్రి కొత్తగూడెం: అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు, జిల్లా కబడ్డీ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పర్స వెంకట్ పలువురు బాధితులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందజేశారు. ప్రజాప్రభుత్వంలో అర్హులందరికి పథకాలు అందుతాయన్నారు. కార్యక్రమంలో దేవాలయ వైస్ ఛైర్మన్ గుజ్జ పూర్ణ, పార్టీ మండల నాయకులు చింతల నరసింహారావు, బొల్లికొండ సత్యం, కార్యకర్తలు పాల్గొన్నారు.