మెదక్: జిల్లాలో గడిచిన 24 గంటల్లో పలు ప్రాంతాల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ పేరుకుంది. అత్యధికంగా శివంపేటలో 128 మిల్లీమీటర్లు, నర్సాపూర్ లో 108.8 మి.మీ, కాగజ్ మద్దూరులో 98 మి.మీ, పెద్ద శంకరంపేట లో 89 మి.మీ, మిగతా చోట్ల ఇంతకన్నా తక్కువ వర్షపాతం నమోదు అయింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.