భద్రాద్రికొత్తగూడెం: ఇల్లెందు సింగరేణి ఏరియా కోయగూడెం ఉపరితల గనిలో వర్షం కారణంగా రాత్రి షిఫ్ట్ నుంచి బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇప్పటి వరకు 5 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి నిలిచిపోయింది. 30 వేల క్యూబిక్ మీటర్ల(ఓవర్ బర్డెన్) మట్టి వెలికితీత పనులు పూర్తిలకు వర్షం ఆటంకం కలిగించిందని అధికారులు తెలిపారు. వర్షం అంతరాయం తొలగిన వెంటనే పనులు మొదలు పెట్టనున్నట్లు పేర్కొన్నారు.