సంగారెడ్డి: గుమ్మడిదల మండలకేంద్రంలో గురువారం బీఆర్ఎస్ నాయకుడు చిమ్ముల గోవర్ధన్రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు అన్ని విధాలుగా అండగా నిలిచిందని అన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ దుర్మార్గ పాలనలో యూరియా కోసం రైతులు కష్టపడాల్సి వస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పాలనలో రైతులు కాళ్లు మొక్కే పరిస్థితి రావడం రాష్ట్ర ప్రభుత్వానికి సిగ్గుచేటని అన్నారు.