మెదక్: టేక్మాల్ మండలంలో కలెక్టర్ రాహుల్ రాజ్ ఆకస్మికంగా పర్యటించారు. ఈసందర్భంగా ఆయన స్థానిక పీహెచ్సీ పరిశీలించి మాట్లాడుతూ.. ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని వైద్య సిబ్బందికి సూచించారు. అనంతరం కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని తనిఖీ చేసి.. విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అధికారులను ఆదేశించారు. తనిఖీలో పలువురు అధికారులు పాల్గొన్నారు.