తిరుమల శ్రీవారిని సినీ ప్రముఖులు జాన్వీ కపూర్, సిద్ధార్థ్ మల్హోత్ర దర్శించుకున్నారు. గురువారం వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో వారు స్వామివారి సేవలో పాల్గొన్నారు. TTD అధికారులు వీరికి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వీరికి పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు. జాన్వీ, సిద్ధార్థ్ కలిసి నటించిన ‘పరమ్ సుందరి’ మూవీ ఈ నెల 29న విడుదల కానుంది.