ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా సినీప్రియులు ఎదురుచూస్తున్న సినిమా ‘కూలీ’. రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ క్రమంలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. కేరళలోని ఓ థియేటర్లో అడ్వాన్స్ టికెట్ల కోసం ఫ్యాన్స్ ఎగబడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కాగా, ఈ సినిమాలో నాగార్జున కీలక పాత్రలో నటిస్తున్నారు.