తెలుగు చలనచిత్ర పరిశ్రమలో రేపట్నుంచి షూటింగ్లు నిలిచిపోనున్నాయి. తమ వేతనాలు 30% పెంచాలని తెలుగు ఫిలిం ఫెడరేషన్ డిమాండ్ చేసింది. పెరిగిన వేతనాలను కూడా రోజువారీగా చెల్లించాలని వారు కోరారు. ఈ డిమాండ్లను అంగీకరించే నిర్మాతల చిత్రాల్లో మాత్రమే పనిచేస్తామని ఫెడరేషన్ నాయకులు స్పష్టం చేశారు. ఈ సమ్మె కారణంగా పలు చిత్రాల షూటింగ్లు తాత్కాలికంగా నిలిచిపోయాయి.
Category: ఎంటర్టైన్మెంట్
-
రామ్చరణ్తో సినిమాపై స్పందించిన ‘కింగ్డమ్’ డైరెక్టర్
కింగ్డమ్ మూవీతో టాలీవుడ్లో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు గౌతమ్ తిన్ననూరి. అయితే రామ్చరణ్తో సినిమా ఆగిపోవడానికి కారణమేంటో చెప్పారు గౌతమ్. ‘‘సినిమాకు సంబంధించి ఓ పాయింట్ను రామ్చరణ్కు చెప్పా. ఆయనకు నచ్చింది. ఆ కథ ఆయనకు సెట్ కాదేమో అని తర్వాత నాకే అనిపించింది. అదే విషయాన్ని చరణ్కు తెలియజేసి, మరో కథతో వస్తానని చెప్పా’’ అని తెలిపారు.
-
దూసుకుపోతున్న కింగ్డమ్.. 3 రోజుల్లో రూ. 67 కోట్లు!
‘‘కింగ్డమ్’’ సినిమా మూడు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 67 కోట్ల రూపాయల గ్రాస్ సాధించింది. ఈ మేరకు సితార ఎంటర్టైన్మెంట్స్ అధికారికంగా పోస్టర్ విడుదల చేసింది. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం మొదటి రోజునే రూ. 39 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టింది. వీకెండ్లో కలెక్షన్లు మరింత పెరిగాయి. ఈరోజు ఆదివారం కావడంతో మూవీ కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం.
-
ఈ సినిమాని పవన్ చూడాలని కోరుకుంటున్నా: అల్లు అరవింద్
‘మహావతార్ నరసింహ’ చిత్రాన్ని పవన్ కల్యాణ్ చూడాలని, దాని గురించి మాట్లాడాలని కోరుకుంటున్నానని నిర్మాత అల్లు అరవింద్ అన్నారు. శ్రీ మహావిష్ణువు నరసింహావతారం ఆధారంగా తెరకెక్కిన యానిమేషన్ మూవీని కన్నడ దర్శకుడు అశ్విన్ కుమార్ రూపొందించారు. ఈ సినిమాని తెలుగులో అల్లు అరవింద్ విడుదల చేశారు. కాగా జులై 25న విడుదలైన ఈ సినిమా ఇప్పటి వరకూ దేశవ్యాప్తంగా రూ.79+ కోట్లు (గ్రాస్) కలెక్షన్స్ చేసింది.
-
ఓటీటీలోకి రొమాంటిక్ కామెడీ మూవీ
ఓటీటీ వేదికగా ప్రేక్షకులకు వినోదం పంచేందుకు రొమాంటిక్ కామెడీ మూవీ సిద్ధమైంది. థియేటర్లలో తమిళ్లో విడుదలకాగా.. ఓటీటీలో తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీలో సందడి చేయనుంది. ఆ సినిమానే ‘ఓహో ఎంథన్ బేబీ’. ‘నెట్ఫ్లిక్స్’లో ఈ నెల 8 నుంచి స్ట్రీమింగ్ కానుంది. తొలి ప్రయత్నంలోనే రుద్ర నటుడిగా ఆకట్టుకున్నాడు. అతడి సరసన హీరోయిన్ మిథిలా పాల్కర్ నటించింది.
-
రాముడి పాత్రలో టాలీవుడ్ స్టార్ హీరో?!
‘‘ఆదిపురుష్’’ మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాముడి పాత్రలో కనిపించిన విషయం తెలిసిందే. ప్రభాస్ తర్వాత మరో టాలీవుడ్ స్టార్ హీరో రాముడి గెటప్లో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైనట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ స్టార్ హీరో ఎవరనేది మాత్రం ఇంకా తెలియరాలేదు. ఆ హీరోకు సంబంధించిన తదుపరి మూవీలో రాముడి పాత్రలో నటించనున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
-
‘నరేష్-65’ సినిమాకు ముహూర్తం ఫిక్స్
అల్లరి నరేష్ హీరోగా 65వ చిత్రానికి పూజ టైంని ఫిక్స్ చేశారు. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్, హాస్య మూవీస్ నిర్మిస్తున్నారు. ఫాంటసీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఆగస్టు 4వ తేదీన ఉదయం 8:30 గంటలకు అన్నపూర్ణ స్టూడియోస్లో జరగబోతున్నట్లు వెల్లడించారు. అలాగే ‘‘పురాణాలు, మాయాజాలం పిచ్చి కామెడీ కోసం సిద్ధంగా ఉండండి’’ అనే క్యాప్షన్ జత చేశారు.
-
మహేశ్ బాబు లుక్ వైరల్.. వీడియో
సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రస్తుతం దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘‘ఎస్ఎస్ఎంబీ 29’’ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా మహేశ్ బాబుకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. వీడియోలో సూపర్ స్టార్ తన భార్య నమ్రతా శిరోద్కర్తో కలిసి ఓ కార్యక్రమానికి హాజరైనట్లు తెలుస్తోంది. వైరలవుతున్న వీడియోలో మహేశ్, నమ్రతా వైట్ అంట్ వైట్ దుస్తుల్లో కనిపించారు. వీడియో కోసం క్లిక్ చేయండి.
-
అడ్వాన్స్ బుకింగ్స్లో మహేశ్బాబు ‘అతడు’ రికార్డు
మహేశ్బాబు నటించిన బ్లాక్బస్టర్ చిత్రం ‘అతడు’ ఆగస్టు 9న రీ-రిలీజ్ కాబోతోంది. తాజాగా మూవీ అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ అయ్యాయి. రీ-రిలీజ్ ఇంకా వారం ఉండగానే బుకింగ్స్లో రూ.కోటి మార్క్ను అందుకుంది. దీంతో రీ-రిలీజ్లో ఈ మార్క్ అందుకున్న తొలి చిత్రంగా నిలిచింది. త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మురళి మోహన్ నిర్మాతగా వ్యవహారించాడు.