బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ ఓ ఫ్యాషన్ ఈవెంట్లో తళుక్కున మెరిసింది. న్యూఢిల్లీలోని తాజ్ ప్యాలెస్లో జరుగుతున్న హ్యుందాయ్ ఇండియా కౌచర్ వీక్ 2025లో సందడి చేసింది. ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ జయంతి రెడ్డి రూపొందించిన పింక్ కలర్ లెహంగాలో ర్యాంప్ వాక్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన ఫొటోలను జాన్వీ ఇన్స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.