Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • తొలిరోజే వన్‌ మిలియన్‌ క్లబ్‌లోకి ‘హరి హర వీరమల్లు’

    పవన్‌ కల్యాణ్‌ ప్రధానపాత్రలో తెరకెక్కిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి కలెకన్లు సాధిస్తోంది. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అమెరికాలో భారీ వసూళ్లను సాధిస్తూ తొలిరోజే వన్ మిలియన్ డాలర్ల క్లబ్‌లో చేరినట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి. పవన్ కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన చిత్రంగా ‘హరి హర వీరమల్లు’ నిలిచింది.

     

  • ‘వార్‌ 2’లో అలియా భట్‌ .. నటి పోస్ట్‌ అర్థమదేనా!

    హృతిక్ రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తోన్న చిత్రం ‘వార్-2’ ట్రైలర్‌కు ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్‌ వచ్చింది.  కాగా, ఈ మూవీట్రైలర్‌ని నటి ఆలియా భట్ ట్విట్టర్(X)లో షేర్ చేశారు. థియేటర్‌లలో కలుద్దాం అని క్యాప్షన్‌ పెట్టారు. దీంతో ‘వార్‌ 2’లో అలియా భట్‌ ఉందా? అని నెటిజన్లు భావిస్తున్నారు. కాగా,, ఈ మూవీ ఆగస్టు 14న విడుదల కానుంది.

     

     

  • ఈసారి ఫాంటసీ కథతో?

    బాలకృష్ణ – క్రిష్‌ జాగర్లమూడి కాంబినేషన్‌లో  ‘గౌతమిపుత్ర శాతకర్ణి’తోపాటు ఎన్టీఆర్‌ బయోపిక్‌ సినిమాలు వచ్చాయి. మరోసారి వీరి కాంబోలో సినిమా రానున్నట్లు తెలుస్తోంది. ఈసారి ఓ ఫాంటసీ కథతో సినిమా రూపొందనున్నట్టు సమాచారం. మరి ఆ కథ ఇన్నాళ్లుగా ప్రచారంలో ఉన్నట్టు ‘ఆదిత్య 369’కి కొనసాగింపుగా ఉంటుందా?, లేక మరో కథనా అనేది తెలియాల్సి ఉంది. త్వరలోనే ఆ ప్రాజెక్ట్‌పై స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి.

     

  • చిరు ‘విశ్వంభర’పై బిగ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్!

    మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘విశ్వంభర’.ఈ మూవీకి వశిష్ట దర్శకత్వం వ‌హిస్తుండ‌గా.. త్రిష హీరోయిన్‌గా నటిస్తుంది. ద‌ర్శకుడు వశిష్ట తాజాగా ఈ మూవీ అప్డేట్ ఇచ్చాడు. ఈ సినిమా చివ‌రి షెడ్యూల్ షూటింగ్ తాజాగా స్టార్ట్ అయిన‌ట్లు మెగాస్టార్ చిరంజీవి సెట్స్‌లో జాయిన్ అయిన‌ట్లు తెలిపాడు. ఈ సంద‌ర్భంగా సెట్స్‌లో ఉన్న చిరు ఫొటోను పంచుకున్నాడు.

  • బిల్లులు చెల్లించడానికి.. ఆస్తులు అమ్ముకుంటున్న స్టార్ హీరో

    హాలీవుడ్ స్టార్ విల్ స్మిత్ ఆర్థిక సమస్యల్లో ఉన్నట్లు తెలుస్తోంది. తన బిల్లులు చెల్లించడానికి ఆస్తులు అమ్ముకుంటున్నట్లు సమాచారం. 2022 ఆస్కార్ అవార్డుల సందర్భంగా క్రిస్ రాక్‌ను చెంపదెబ్బ కొట్టిన సంఘటన తర్వాత ఆయన పరిస్థితి దిగజారిపోయినట్లు తెలుస్తోంది. ‘బ్యాడ్ బాయ్స్: రైడ్ ఆర్ డై’తో బాక్సాఫీస్ విజయం సాధించినా.. ఆయనకు అవసరాలకు తగిన ఆదాయం రావట్లేదని తెలుస్తోంది. భార్య జాడా విడిపోయారని, విడాకుల తర్వాత ఆయన ఆర్థిక స్థితి మరింత దారుణంగా మారొచ్చని సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.

  • హాట్ లుక్‌లో మెరిసిన మీనాక్షి!

    హీరోయిన్ మీనాక్షి చౌదరీ తాజాగా ఓ మైండ్‌ బ్లోయింగ్‌ ఫోటోను SMలో పంచుకుంది. ఇందులో ఆమె బ్లాక్‌ ఔట్‌ ఫిట్‌ హాట్ లుక్‌లో మెరిసింది.

  • ‘కింగ్డమ్‌’లో ఆ సీన్‌ హైలైట్‌.. స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్!

    ‘కింగ్డమ్‌’లో వచ్చే జైలు సీన్‌ సినిమాకు హైలైట్‌ అని దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి చెప్పారు. ఈ చిత్రంలో 30 నిమిషాల జైలు ఎపిసోడ్‌ వర్షంలోనే ఉంటుందన్నారు. శ్రీలంకలో ఉన్న ఈ జైలు 200 ఏళ్లనాటిదన్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఈనెల 31న రిలీజ్ కానుంది. తాజాగా నిర్వహించిన ‘కింగ్డమ్‌ బాయ్స్‌’ పాడ్‌ క్యాస్ట్‌లో గౌతమ్‌ తిన్ననూరి ఈ విషయాలు పంచుకున్నాడు.

  • అభిమాని చికిత్సకు.. బాలయ్య చొరవ!

    AP: ఆదోని పట్టణానికి చెందిన తన అభిమాని అనారోగ్య పరిస్థితిని తెలుసుకున్న నటుడు బాలకృష్ణ చలించిపోయారు. ప్రభుత్వం నుంచి ఆయనకు రూ.10 లక్షలు సాయం అందేలా చొరవ చూపారు. బద్రిస్వామి కాలేయవ్యాధి చికిత్సకు రూ.20 లక్షలు అవుతుంది.. ఆర్థిక సమస్యల కారణంగా చికిత్స చేయించుకోలేని అతడి పరిస్థితిని బాలయ్య దృష్టికి వెళ్లింది. దీంతో ఆయన ప్రభుత్వం నుంచి రూ.10 లక్షలు ఎల్‌ఓసీ మంజూరు చేయించారు.

  • గోవా సీఎంను కలిసిన నటుడు అలీ.. ఎందుకంటే?

    టాలీవుడ్ నటుడు అలీ.. గోవా సీఎం ప్రమోద్‌ సావంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. అలీ షూటింగ్‌కు వచ్చిన సంగతి తెలుసుకున్న గోవా సీఎం.. తనను కలవాలని అలీకి చెప్పారట. దీంతో అలీ ముఖ్యమంత్రిని కలిశారు. దాదాపు 1260 సినిమాల్లో నటించటం అంటే చాలా పెద్ద విషయమంటూ అలీని ప్రశంసించారు. అలాగే గోవాలో జరిగే ‘గోవా ఫిలిం ఫెస్టివల్‌’కు అతిథిగా రావాలని సీఎం కోరడంతో అలీ పాల్గొంటానని మాటిచ్చారు.

  • ఆ నలుగురికి జై కొట్టిన విజయ్‌ దేవరకొండ

    విజయ్‌ దేవరకొండ-గౌతమ్‌ తిన్ననూరి కాంబోలో రాబోతున్న మూవీ ‘కింగ్డమ్‌’. జులై 31న విడుదలకానుంది. ఈ సందర్భంగా దర్శకుడు సందీప్‌రెడ్డి వంగాతో కలిసి విజయ్‌, గౌతమ్‌ మాట్లాడారు. ‘‘ప్రస్తుతం సినిమా నా చేతుల్లో నుంచి వెళ్లిపోయింది. ఇప్పుడు నేను జై గౌతమ్‌ (దర్శకుడు), జై అనిరుధ్‌ (సంగీత దర్శకుడు), జై నవీన్‌ నూలీ (ఎడిటర్‌), జై శ్రీరామ్‌ (దేవుడు) అంటున్నాను’’ అని విజయ్‌ చెప్పుకొచ్చాడు.