Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘హరి హర వీరమల్లు’ పార్ట్-2 పేరు ఇదే!

    హరిహర వీరమల్లులో  కోహినూర్ వజ్రం కోసం వీరమల్లు (పవన్) ఢిల్లీ బయల్దేరగా.. అడ్డుకునేందుకు ఔరంగజేబు(బాబీ డియోల్) సిద్ధమవుతారు. వీరిద్దరూ కలుసుకోవడంతోనే మూవీని ముగించారు. అంతేకాకుండా చివర్లో ‘యుద్ధ భూమి’ అనే నేమ్ కార్డుతో అసలైన యుద్ధం అప్పుడే చూడాలంటూ పార్ట్-2పై అంచనాలు పెంచారు.  ఔరంగజేబుతో వీరమల్లు పోరాట సన్నివేశాలు హరిహర వీరమల్లు పార్ట్- 2లో ప్లాన్ చేసినట్లు సమాచారం.

     

  • HHMV రిలీజ్.. ఫ్యాన్స్ వీరంగం

    AP: హరి హర వీరమల్లు(HHMV) మూవీ రిలీజ్ నేపథ్యంలో కొన్ని థియేటర్ల వద్ద పలువురు పవన్ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. మచిలీపట్నం రేవతి థియేటర్ వద్ద ప్రీమియర్ షో సందర్భంగా తోపులాట జరిగింది. అభిమానులు ఒక్కసారిగా హాల్లోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా ఎంట్రన్స్ అద్దాలు పగిలిపోయాయి. పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపు చేశారు. కాగా, ఈ సినిమాను ఇప్పటివరకు చూసినవారంతా సూపర్ హిట్ అని చెబుతున్నారు.

     

  • వీరమల్లు… పవన్‌కల్యాణ్ వన్‌ మేన్‌ షో: ఆది

    పవన్ కల్యాణ్ న్యూ మూవీ ‘హరి హర వీర మల్లు’ ఈరోజు థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఈ మూవీ చూసిన చాలామంది తమ అభిప్రాయాలను సోషల్‌మీడియాలో తెలియజేస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై హైపర్ ఆది తన రివ్యూ చెప్పారు. వీరమల్లు… పవన్‌కల్యాణ్ వన్‌ మేన్‌ షో అని అన్నారు. ప్రతి ఒక్కరూ తప్పక థియేటర్లలో చూడాలని కోరారు.

     

     

  • ‘‘హరి హర వీరమల్లు’’ మూవీ ఎలా ఉందంటే?

    పవన్ కళ్యాణ్ “హరి హర వీరమల్లు” అభిమానులను ఆకట్టుకుంటోంది. పవన్‌ నటన, యాక్షన్, కీరవాణి సంగీతం సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. అయితే వీఎఫ్‌ఎక్స్ నాసిరకంగా ఉండటం సినిమాకు ప్రధాన లోపం. సెకండాఫ్‌లో కథనం నెమ్మదించడం మూవీకి మైన‌స్‌. ప‌వన్ క‌ల్యాణ్ స్వ‌యంగా తీర్చిదిద్దిన యాక్ష‌న్ ఎపిసోడ్ బాగుంది. ఔరంగజేబు పాత్రలో బాబీ డియోల్ అద‌ర‌గొట్టాడు. పంచమి పాత్రలో హీరోయిన్ నిధి అగర్వాల్ ఫ‌ర్వాలేద‌నిపించింది.

  • హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు ప‌బ్లిక్ టాక్ ఇదే!

    పవన్ కళ్యాణ్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న “హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు” చిత్రం థియేట‌ర్ల‌లో సంద‌డి చేస్తోంది. ఈ సినిమా ప్రీమియ‌ర్స్‌ చూసిన ఫ్యాన్స్ ఎక్స్ వేదిక‌గా మూవీ విశేషాలు పంచుకుంటున్నారు. మూవీలో ప‌వ‌న్ ఎంట్రీ, బ్యాగ్రౌండ్ మ్యూజిక్‌, యాక్షన్ సన్నివేశాలు, వీఎఫ్ఎక్స్ అత్యద్భుతంగా ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. నిధి అగర్వాల్ కూడా తన పాత్రలో ఒదిగిపోయిందని చెబుతున్నారు.

  • సీఎం చంద్రబాబు ట్వీట్‌కు ప‌వ‌న్ ఏమ‌న్నారంటే?

    ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు మూవీ హిట్ కావాల‌ని చేసిన ట్వీట్‌పై ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాగా స్పందించారు. గత పదేళ్లుగా సీఎం చంద్ర‌బాబుగారితో పలుమార్లు సమావేశమైనా ఎప్పుడూ సినిమాల ప్రస్తావన రాలేదని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఈరోజు ‘హరిహర వీరమల్లు’ చిత్రం గురించి చంద్రబాబు ఆప్యాయంగా అందించిన ఆకాంక్ష తనకు ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించిందని పవన్ కళ్యాణ్ తెలిపారు.

  • ‘హరిహర వీరమల్లు’ సూపర్‌హిట్‌ కావాలి: సీఎం చంద్రబాబు

    ‘హరిహర వీరమల్లు’ సినిమా సూపర్‌హిట్‌ కావాలని కోరుకుంటున్నట్లు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ మేరకు ఎక్స్‌లో ఆయన పోస్టు పెట్టారు. ‘‘పవన్ కల్యాణ్‌ అభిమానులు, ప్రేక్షకులు ఎంతో కాలంగా ఎదురుచూసిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం విడుదల సందర్భంగా నా శుభాకాంక్షలు. మిత్రుడు పవన్ కల్యాణ్‌ కథానాయకుడిగా చరిత్రాత్మక కథాంశంతో రూపొందిన ఈ సినిమా సూపర్ హిట్ కావాలని కోరుకుంటున్నా’’ అని పేర్కొన్నారు.

  • వీడియో.. పవన్ కళ్యాణ్ అభిమానుల హంగామా

    తెలుగు రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ అభిమానుల సందడి మొదలైంది. పవర్ స్టార్ నటించిన హరిహర వీరమల్లు మూవీ రేపు ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల కానుంది. అయితే ప‌వ‌న్ క్రేజ్ దృష్ట్యా ఇప్ప‌టికే కొన్ని ప్రాంతాల్లో ప్రీమియ‌ర్ షోలు మొద‌లుపెట్టారు. ఈ షోలకు వచ్చిన ఆయన అభిమానులు సందడి చేస్తున్నారు. సీఎం.. సీఎం అంటూ నినాదాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

  • ‘నేను ఎవరిని కొడితే వాళ్ల సినిమా హిట్‌’

    టీజయ్‌ అరుణాసలం-జననీ కునశీలన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఉసురే’. ఇందులో సీనియర్‌ హీరోయిన్‌ రాశి కీలకపాత్రలో కనిపించనుంది. హైదరాబాద్‌లో జరిగిన మూవీ ఆడియో లాంచ్‌లో ఆమె మాట్లాడారు. ‘‘ఈ చిత్రంలో నేను హీరోహీరోయిన్‌ను కొట్టాను. ‘ప్రేయసిరావే’ మూవీలో హీరో శ్రీకాంత్‌ను కొట్టాను. అది హిట్టైంది. నాకున్న సెంటిమెంట్‌‌తో ‘ఉసిరే’ కూడా హిట్‌. ఎందుకంటే నేను ఎవరిని కొడితే వాళ్ల సినిమా హిట్‌ అవుతుంది’’ అని తెలిపింది.

  • అమితాబ్, ఆమిర్ ఖాన్ కార్లపై రూ.38 లక్షల జరిమానాలు!


    బాలీవుడ్ ప్రముఖులైన అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ గతంలో వాడిన రెండు రోల్స్ రాయిస్ కార్లకు బెంగళూరులో భారీ జరిమానాలు విధించారు. రోడ్డు పన్ను చెల్లించనందుకు రూ. 38 లక్షలకు పైగా ఫైన్ పడింది. ప్రస్తుతం వ్యాపారవేత్త యూసుఫ్ షరీఫ్ (కేజీఎఫ్ బాబు) వద్ద ఉన్న ఈ కార్లు, మహారాష్ట్రలో రిజిస్టర్ అయి ఉన్నా, బెంగళూరులో నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. యాజమాన్య బదిలీ జరగకపోవడంతో పాత యజమానుల పేర్లే పేపర్లపై ఉన్నాయి.