Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘రామాయణ’ మూవీ.. హనుమంతుడి పాత్ర 15 నిమిషాలే!

    డైరెక్టర్‌ నితీశ్‌ తివారి తెరకెక్కిస్తోన్న ‘రామాయణ’ సినిమాలో హనుమంతుడి పాత్రలో బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్‌ కనిపించనున్నారు. అయితే, రెండు పార్టులుగా రానున్న ఈ సినిమా మొదటిభాగంలో ఆయన పాత్ర సమయం చాలా తక్కువగా ఉండనున్నట్లు సమాచారం. 15 నిమిషాలు మాత్రమే కనిపిస్తారట. రెండో భాగంలో ఆయన పాత్రే కీలకం కానున్నట్లు తెలుస్తోంది. పార్ట్‌ 2లో ఎక్కువసేపు కనిపించనున్నారట.

     

  • కపిల్ శర్మ రెస్టారెంట్‌పై అందుకే దాడి చేశాం: హర్జిత్‌సింగ్ లడ్డి

    కెనడాలో బాలీవుడ్ హాస్యనటుడు కపిల్‌శర్మకు చెందిన రెస్టారెంట్‌పై కాల్పులు జరిపింది తామేనని నిషేధిత ఉగ్రవాద సంస్థ బబ్బర్ ఖల్సా ఇంటర్నేషనల్(BKI)తో సంబంధం ఉన్న హర్జిత్‌సింగ్ లడ్డి తెలిపారు. ఇటీవల కపిల్ శర్మ షోలో పాల్గొన్న ఒకరు నిహాంగ్ సిక్కుల సాంప్రదాయ దుస్తులపై హాస్యాస్పద వ్యాఖ్యలు చేశారని, అవి తమ సమాజిక మనోభావాలను దెబ్బతీశాయని చెప్పారు. అందుకే రెస్టారెంట్‌పై కాల్పులు జరిపామన్నారు.

  • స్టైలిష్ లుక్‌లో ప్రభాస్..

    ప్రభాస్ తనతో దిగిన ఫొటోను మ్యూజిక్ డైరెక్టర్​ తమన్ సోషల్‌మీడియాలో​ షేర్​ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటో సోషల్​ మీడియాలో వైరల్​గా మారింది. డార్లింగ్ స్టైలిష్​ లుక్​లో అంటూ నెటిజన్లు కామెంట్స్​ పెడుతున్నారు. కాగా, ప్రభాస్ న్యూ మూవీ ‘ది రాజా సాబ్’కు తమన్ సంగీతం అందిస్తున్నారు. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తోన్న ఈ చిత్రం డిసెంబర్‌ 5న సినిమా విడుదల కానుంది.

  • “బాహుబలి ది ఎపిక్‌” రన్‌టైమ్‌ 5.27 గంటలు

    దర్శకుడు రాజమౌళి తెరకెక్కించిన ‘బాహుబలి 1&2’ సినిమాలను ఒకే మూవీగా “బాహుబలి ది ఎపిక్‌’’గా రీ రిలీజ్‌ చేయనున్నారు. అక్టోబర్‌ 31న విడుదల కానున్న ఈ చిత్ర రన్‌టైమ్‌ దాదాపు 5గంటల 27నిమిషాలు సినిమా ఉండనుందని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. ఈక్రమంలో దీనిపై బాహుబలి టీమ్ ఇంట్రెస్టింగ్‌ ట్వీట్‌ చేసింది. ‘కంగారు పడకండి. మేము మీ రోజు మొత్తాన్ని తీసుకోవట్లేదు. ఇది IPLమ్యాచుకు సమానం’అని రాసుకొచ్చింది.

     

  • అలా ఫొటోలు తీయకండి.. హీరోయిన్ ఆగ్రహం..

    బాలీవుడ్ హీరోయిన్ జరీన్ ఖాన్ తనదైన స్టైల్లో ఫొటోలు తీసేవారికి వార్నింగ్ ఇచ్చింది. ముంబై అంథేరీలోని ఓ రెస్టారెంట్‌కు వెళ్లిన ఆమెను కొంతమంది ఫొటోలు, వీడియోలు తీయటం ఆమెకు ఇబ్బందిగా అనిపించింది. వెంటనే వెనక్కు తిరిగి.. ‘ముందు నుంచి ఫొటోలు తీయండి. వెనుకనుంచి కాదు’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

  • ‘ది 100’ మూవీ రివ్యూ

    ఆర్కే సాగర్ ప్రధాన పాత్రలో నటించిన ‘ది 100’ మూవీ నేడు థియేటర్లలో రిలీజైంది. నేర ప‌రిశోధ‌న నేప‌థ్యంలో సాగే క‌థ ఇది. ద‌ర్శ‌కుడు హీరోని చూపించిన తీరు బాగుంది కానీ… క‌థ‌, క‌థ‌నాల‌పై ఇంకాస్త దృష్టి పెట్టి ఉంటే బాగుండేది. ఐపీఎస్ విక్రాంత్ పాత్ర‌లో మ‌రింత అథెంటిక్‌గా క‌నిపించాడు ఆర్కే సాగ‌ర్‌. పుష్ప సినిమాలో మెరిసిన తార‌క్ పొన్న‌ప్ప విల‌న్‌గా మెప్పిస్తాడు. రేటింగ్: 2.5/5.

     

  • నటి వాడేసిన బ్యాగు ధర అక్షరాలా రూ.85 కోట్లు

    పారిస్‌లో నిర్వహించిన సోథిబే వేలంలో జానే బర్కిన్ వాడిన ‘హర్మీస్ బర్కిన్’ బ్యాగు రూ.85 కోట్లు  ధర పలికి రికార్డు సృష్టించింది. జపాన్‌కు చెందిన ఓ ప్రైవేటు కలెక్టర్ దీన్ని  దక్కించుకున్నట్లు వేలం నిర్వాహకులు తెలిపారు. ఈ బ్యాగు ఫ్యాషన్ చరిత్రలో అత్యంత విలువైన వస్తువుగా నిలిచింది.

    1985 నుంచి 1994 వరకు ఆమె ఈ బ్యాగ్‌ను వాడారు.
  • ఆశా భోంస్లే చనిపోయారంటూ ప్రచారం.. క్లారిటీ ఇదే

    ప్రముఖ బాలీవుడ్ గాయిని ఆశా భోంస్లే మరణించారంటూ ఇటీవల వార్తలు వచ్చాయి. జూలై 1న ఆమె కన్నుమూశారంటూ సోషల్ మీడియోలో ప్రచారం జరిగింది. అయితే తాజాగా దీనిపై ఆశా భోంస్లే కుమారుడు ఆనంద్ భోంస్లే స్పందించారు. ఈ వార్తలన్ని పూర్తిగా అవాస్తవమని కొట్టిపారేశారు. తన తల్లి చనిపోలేదని, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని కోరారు.

  • శ్రీశ్రీ రవిశంకర్‌ బయోపిక్‌.. విక్రాంత్‌ మాస్సే ఏమన్నారంటే!

    బాలీవుడ్‌ నటుడు విక్రాంత్‌ మాస్సే ప్రధాన పాత్రలో ఆర్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ వ్యవస్థాపకులు, ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్‌ బయోపిక్‌ ‘వైట్‌’ తెరకెక్కనుంది. ఈ మూవీపై విక్రాంత్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘ఇంత గొప్ప బయోపిక్‌లో నటించే అవకాశం రావడం ఎంతో సంతోషంగా ఉంది. ఆగస్టులో ‘వైట్‌’ సెట్స్‌ పైకి వెళ్తుంది. రవిశంకర్‌ నిజ జీవితానికి సంబంధించిన అంశాలను ఇందులో చూపిస్తాం’’ అని పేర్కొన్నారు.

  • మా సినిమాకు ప్రభుత్వ తోడ్పాటు అవసరంలేదు: ఆర్.నారాయణమూర్తి

    స్వీయ దర్శకత్వంలో ఆర్.నారాయణమూర్తి నటించిన ‘యూనివర్సిటీ పేపర్ లీక్’ మూవీ వచ్చే నెల 22న విడుదల. హైదరాబాద్‌లోని ప్రసాద్ థియేటర్లో పలువురు ప్రముఖులు ఈ మూవీని వీక్షించారు. ఈ సందర్భంగా నాయారణమూర్తి మాట్లాడుతూ.. తన సినిమాకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఎలాంటి రాయితీలు అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వం నుంచి తనకు ఏ సహకారం అవసరం లేదన్నారు.