ఓటీటీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న వెబ్ సిరీస్లలో ‘పంచాయత్’ ఒకటి. ఆ సిరీస్లో చూపించిన మధ్యప్రదేశ్లోని మహోదియా(ఫులేరా) గ్రామం ఇప్పుడెలా ఉందో చూపే వీడియో వైరలవుతోంది. ఈ లో సిరీస్లో చూపిన విధంగా కాకుండా, పంచాయతీ కార్యాలయం ముందు బురద నిండిపోయి అసౌకర్యంగా కనిపించడం చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. సిరీస్ కోసమే దీనిని తీర్చిదిద్దారా? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.