Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘హరి హర వీరమల్లు’ మూవీ రిలీజ్ వాయిదా

    పవన్‌ కల్యాణ్‌ హీరోగా నటిస్తోన్న సరికొత్త చిత్రం ‘హరిహర వీరమల్లు’.  జూన్‌ 12న ఇది విడుదలవుతుందని భావించిన అభిమానులకు మరోసారి నిరాశ ఎదురైంది. ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా పడినట్లు టీమ్‌ తాజాగా అధికారికంగా ప్రకటించింది. అంతేకాకుండా త్వరలోనే ట్రైలర్‌ రిలీజ్‌ కానుందని.. కొత్త విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని టీమ్‌ వెల్లడించింది.

  • రవి–కెనీషా ఫొటోలు వైరల్-పెళ్లి చేసుకున్నారా?

    కోలీవుడ్ హీరో రవి ,కెనీషా  కలిసి మురుగన్ దేవాలయంలో దిగిన ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియా అంతటా వైరల్‌గా మారాయి. వీరి మెడలో పూల దండలు కనిపించడంతో, “పెళ్లి చేసుకున్నారా?” అంటూ నెటిజన్లు పెద్ద ఎత్తున కామెంట్స్​ చేస్తున్నారు.  గతేడాది  రవి తన భార్య ఆర్తితో విడాకులు తీసుకుంటున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆర్తితో విడాకుల వెనుక కెనీషాతో ఉన్న సంబంధమే కారణమని వార్తలు వచ్చాయి.

  • ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ మూవీ.. 2వేల మందితో భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌

    ఎన్టీఆర్‌, ప్రశాంత్‌ నీల్‌ కాంబోలో తెరకెక్కుతోన్న మూవీ షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. ప్రస్తుతం 2వేల మంది జూనియర్‌ ఆర్టిస్టుల మధ్యలో తారక్‌ ఉన్న భారీ యాక్షన్‌ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. ఇది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ మూవీలో రుక్మిణీ వసంత్‌ హీరోయిన్‌గా, టొవినో థామస్‌ కీలక పాత్రలో నటిస్తున్నారు. కాగా, వచ్చే ఏడాది జూన్‌ 25న ఈ మూవీ రిలీజ్‌ కానుంది.

  • ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చిన ‘లాల్ సలామ్’

    తమిళ యాక్టర్స్ రజినీకాంత్‌, విష్ణు విశాల్, విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్‌ సలామ్‌’ ఎట్ట‌కేల‌కు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ SunNXT వేదికగా స్ట్రీమింగ్ అవుతుంది. గ‌తేడాది ఫిబ్ర‌వ‌రి 9న రిలీజైన ఈ చిత్రం డిజాస్టర్‌గా మిగిలింది. కాగా, దాదాపు ఏడాదిన్నర తర్వాత ఓటీటీ స్ట్రీమింగ్‌కు రావడం గమనార్హం.

  • అనుమతి లేకుండా ఫొటోలు తీయడంపై రానా ఆగ్రహం

    ముంబయి విమానాశ్రయం వద్ద టాలీవుడ్ నటుడు రానా ఫొటోలు తీసేందుకు ఓ ఫొటోగ్రాఫర్‌ ఉత్సాహం చూపించారు. దీంతో రానా ఫోన్‌ పడిపోవడంతో  అతడిని సున్నితంగా మందలించాడు.దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరలవుతోంది. కాగా, టాలీవుడ్‌లో నటీనటులకు కొంచెం ప్రైవసీ ఉందని ఇటీవల ఓ మీడియా సంస్థతో రానా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

  • ఘనంగా అఖిల్ వివాహం… ఫొటోలు వైరల్

    నటుడు అఖిల్‌ అక్కినేని తన ప్రియురాలు జైనబ్‌ రవ్జీని వివాహం చేసుకున్నారు. వీరి పెళ్లికి సంబంధించిన ఫొటోలు సోషల్‌మీడియాలో వైరలవుతున్నాయి.

  • బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీకి నిశ్చితార్థం

    తెలుగు బిగ్‌బాస్‌ 7 సీజన్‌ శుభశ్రీ రాయగురు త్వరలోనే పెళ్లిపీటలెక్కనుంది. ‘మనోభావాలు పాప’గా ఫేమస్‌ అయిన ఈ బ్యూటీ ప్రియుడు, నటుడు, నిర్మాత అజయ్‌ మైసూర్‌ను పెళ్లాడబోతుంది. తాజాగా వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. అందుకు సంబంధించిన ఫోటోలను ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేసింది. ఫైనల్లీ.. మా ఎంగేజ్‌మెంట్‌ జరిగిందని క్యాప్షన్‌ జోడించింది.

  • సైలెంట్‌గా ఓటీటీలోకి వచ్చేసిన ‘#సింగిల్‌’

    శ్రీ విష్ణు హీరోగా నటించిన చిత్రం ‘#సింగిల్‌’. ప్రముఖ OTT  సంస్థ అమెజాన్‌ ప్రైమ్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్‌ అవుతుంది.

  • నటుడు షైన్‌ టామ్‌ చాకో తండ్రి మృతి

    మలయాళ నటుడు షైన్‌ టామ్‌ చాకో కారుకు రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆయన తండ్రి సీపీ చాకో మృతి చెందారు.  నటుడితోపాటు తల్లి, సోదరుడు, కారు డ్రైవర్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. ఉదయం 7 గంటల సమయంలో తమిళనాడులోని ధర్మపురికి సమీపంలోని పాలకోట్టై వద్ద వారి కారు ముందున్న లారీని ఢీకొట్టింది. దీంతో అందరికి గాయాలు కాగా ఆస్పత్రిలో చేరారు. నటుడి తండ్రి చికిత్స పొందుతూ మరణించారు.

  • అఖిల్ అక్కినేని పెళ్లి.. హజరైన చిరంజీవి, ప్రశాంత్ నీల్

    హీరో నాగార్జున చిన్న కుమారుడు అఖిల్‌ బ్యాచిలర్‌ లైఫ్‌కు గుడ్‌బై చెప్తూ వైవాహిక జీవితానికి వెల్‌కమ్‌ చెప్పాడు. ప్రియురాలు జైనబ్‌ను వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్‌ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఈ వెడ్డింగ్‌కు హాజరయ్యారు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో రిసెప్షన్ జరగనుంది.