మంచు విష్ణు ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం ‘కన్నప్ప’. ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు మోహన్ బాబు ఆసక్తికర పద్యం చెప్పారు. ‘‘వజ్రాయుధం పుష్పంగా మారిపోతుంది. అగ్ని మంచుగా మారిపోతుంది. సముద్రం భూమిగా మారిపోతుంది. శత్రువు మిత్రుడుగా మారిపోతాడు. విషము దివ్యాహారం అవుతుంది ’’ అంటూ మోహన్ బాబు పద్యానికి అర్ధం వివరంగా చెప్పారు.
Category: ఎంటర్టైన్మెంట్
-
‘పవన్ సినిమాను ఆపే అధికారం ఎవరికి లేదు’
150 కోట్ల జనాభా ఉన్న దేశంలో ప్రేక్షకులను అలరించేందుకు 30 నుంచి 40 మంది హీరోలు మాత్రమే ఉన్నారని తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ నూతన అధ్యక్షుడు సునీల్ నారంగ్ అన్నారు. హీరోలు దేవుళ్లు లాంటివారని, వాళ్లకు వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ఏ ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాతలు చేయరని వ్యాఖ్యానించారు. హీరో పవన్ కల్యాణ్ తుపానులాంటి వారని, ఆయన సినిమాను ఆపే అధికారం ఎవరికి లేదన్నారు.
-
VIDEO: జోకులొద్దు.. మోహన్ బాబుకు బ్రహ్మానందం స్వీట్ వార్నింగ్!
గుంటూర్లో నిర్వహించిన ‘కన్నప్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నటుడు మోహన్ బాబు బ్రహ్మానందంతో 40 ఏళ్ల అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. హీరో-ఆర్టిస్ట్గా సినిమాలు, సిల్వర్-గోల్డెన్ జూబ్లీలు సాధించిన జ్ఞాపకాలను పంచుకున్నారు. బ్రహ్మనందం సభకు వచ్చాడా.. అని మోహన్ బాబు అనగా.. జోకులొద్దు అంటూ.. బ్రహ్మానందం స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. “ఆ పరమేశ్వరుడి సాక్షిగా, ఐ లవ్ యూ బ్రహ్మానందం” అని భావోద్వేగంతో అన్నారు.
-
ఆకట్టుకునే అందం రాశీ సొంతం!
హీరోయిన్ రాశీఖన్నా తన లేటెస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో పంచుకుంది. ఇందులో ఆమె బ్లాక్ కలర్ డ్రెస్లో ఎంతో బ్యూటీఫుల్గా కనిపిస్తోంది. ఈ ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.
-
రాజకీయాల్లోకి.. ప్రముఖ నటి ఆసక్తికర వ్యాఖ్యలు!
బాలీవుడ్ నటి సోనాలి బింద్రే తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజకీయాలోకి రావడంపై తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. ‘‘పాలిటిక్స్లోకి అడుగుపెట్టాలని ఏమాత్రం అనుకోవడం లేదు. ఎందుకంటే, ఆ రంగంలో రాణించాలంటే ప్రశంసలు, విమర్శలు ఏది ఎదురైనా తీసుకోవడానికి మనం సిద్ధంగా ఉండాలి. అంత ధైర్యం నాకు లేదు. రాజకీయాలపై నాకు పెద్ద అవగాహన లేదు’’ అని ఆమె వెల్లడించారు.
-
35 రోజులకు రూ. 25 కోట్లు డిమాండ్ చేసిన నటి!
ప్రముఖ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘స్పిరిట్’ సినిమా నుంచి బాలీవుడ్ నటి దీపికా పదుకొనే తప్పుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరో విషయం బయటకు వచ్చింది. ఆమె దాదాపు 35 రోజుల షూటింగ్ కోసం 25 కోట్లు డిమాండ్ చేసిందని, దానితో పాటు 10% లాభాల వాటాను కూడా డిమాండ్ చేసిందని ఒక నివేదిక తెలిపింది. తెలుగులో డైలాగులు చెప్పడానికి ఇష్టపడలేదని సమాచారం.
-
ప్రభాస్ సినిమా కోసం గోడ దూకిన అనుపమ్ ఖేర్
బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్కు ‘ఫౌజీ’ షూటింగ్ సమయంలో వింత అనుభవం ఎదురైంది. హైదరాబాద్లో ప్రభాస్ చిత్ర షూట్కు వెళ్లేప్పుడు డ్రైవర్ దారి తప్పి కారు రివర్స్ కాకపోవడంతో, గోడ దూకి యూనిట్ సహాయంతో లోపలికి చేరుకున్నారు. ఈ ఆసక్తికర వీడియోను ఆయన Xలో పంచుకున్నారు.
-
పవన్ సూపర్ హిట్ మూవీ రీ-రిలీజ్.. ఎప్పుడంటే?
పవన్ కల్యాణ్-కీర్తి రెడ్డి జంటగా నటించిన సూపర్ హిట్ మూవీ ‘తొలిప్రేమ’ మరోసారి విడుదలకు సిద్ధమైంది. జూన్ 14న ఈచిత్రాన్ని 4Kవర్షన్లో రీ-రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
-
కుంభకోణం కేసు.. ప్రముఖ నటుడుకి ఈడీ నోటీసులు!
ముంబయిలోని మిథి నది కుంభకోణంలో బాలీవుడ్ నటుడు డినో మోరియాకు ఈడీ సమన్లు జారీ చేసింది. అలాగే నటుడి సోదరుడితో పాటు ఎనిమిది మందిని వచ్చేవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. ఇటీవల నటుడికి చెందిన కార్యాలయాలు, నివాసంపై ఈడీ దాడి చేసిన విషయం తెలిసిందే. మిథి నది పూడికతీత కుంభకోణానికి సంబంధించి మనీలాండరింగ్ కింద కేసు నమోదు చేసి ఈడీ దర్యాప్తు చేస్తున్నది.
-
ఓటీటీలో ట్రెండింగ్ అవుతున్న ‘జాట్’
సన్నీదేవోల్ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ ‘జాట్’. ఈ సినిమా థియేటర్లలో రూ.100 కోట్లకుపైగా రాబట్టింది. ఇప్పుడీ చిత్రం నెట్ఫ్లిక్స్ ఓటీటీలో హిందీ, తెలుగు భాషల్లో స్ట్రీమింగ్ అవుతోంది. ప్రస్తుతం ఇండియా వైడ్గా నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతోంది. ఈవిషయాన్ని తెలుపుతూ మేకర్స్ తాజాగా సరికొత్త పోస్టర్ పంచుకున్నారు. దీనికి పార్ట్-2 కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.