Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • అల్లు అర్జున్‌ – అట్లీ ప్రాజెక్ట్‌.. హీరోయిన్‌గా దీపికా పదుకొణె

    అల్లు అర్జున్‌ హీరోగా దర్శకుడు అట్లీ ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీలో హీరోయిన్‌గా దీపికా పదుకొణె నటించనున్నట్లు చిత్ర నిర్మాణ సంస్థ సన్‌ పిక్చర్స్‌ ప్రకటించింది. ఈ చిత్రానికి రెండు టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయట.  ఐకాన్‌, సూపర్‌హీరో వంటి వాటిని ఎంపికచేశారని తెలుస్తోంది.

     

  • ‘హరిహర వీరమల్లు’ @ రూ.250 కోట్ల బడ్జెట్‌: జ్యోతికృష్ణ

    పవన్‌ కల్యాణ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘హరిహర వీరమల్లు’. ఈ సినిమా బడ్జెట్‌ గురించి దర్శకుడు జ్యోతికృష్ణ ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. సుమారు రూ.250 కోట్లకు పైగా బడ్జెట్‌తో దీనిని నిర్మిస్తున్నట్లు చెప్పారు.  ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు జరుగుతున్నాయన్నారు. త్వరలోనే ఈ చిత్రం రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని తెలిపారు.

  • సమంత ఆ టాటూ తొలగించేశారా..?: నెటిజన్ల ప్రశ్నలు

    సినీ నటి సమంత సోషల్‌మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా ఇన్‌స్టాలో ‘నథింగ్‌ టు హైడ్‌’ పేరుతో  ఓ స్పెషల్‌ వీడియోను షేర్‌ చేసింది. అయితే, ఈ వీడియోలో  ఆమె మెడపై కనిపించని ‘ఏమాయచేసావె’ టాటూ కనిపించలేదు. దీంతో చాలా మంది నెటిజన్లు  ‘ఏమాయచేసావె టాటూ తొలగించేశారా?’ అంటూ నెటిజన్లు సమంతను ప్రశ్నిస్తున్నారు.

  • పవన్ కల్యాణ్‌ను కలిసిన అర్జున్‌ దాస్‌

    ‘ఓజీ’ మూవీ షూటింగ్ సెట్‌లో పవన్‌ కల్యాణ్‌ను నటుడు అర్జున్‌ దాస్ కలిశారు. పవన్‌ను కలిసి మాట్లాడిన క్షణాలను జీవితాంతం గుర్తుపెట్టుకుంటానంటూ సోషల్‌మీడియాలో పోస్ట్ పెట్టారు.

     

  • కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అడ్డుకుంటాం.. బ్రాహ్మణ సంఘాల వార్నింగ్

    హీరో మంచు విష్ణు న్యూ మూవీ ‘కన్నప్ప’ ఈ నెల 27న విడుదల కానుంది. అయితే ఈ చిత్రంలోని ‘పిలక గిలక’ పాత్రపై బ్రాహ్మణ సంఘాలు మండిపడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈరోజు గుంటూరులో నిర్వహించే కన్నప్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌‌ను అడ్డుకుంటామని హెచ్చరించాయి. పిలక గిలక పాత్రపై స్పష్టత ఇవ్వకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపాయి.

     

     

  • ర‌వితేజ సూప‌ర్ హిట్ మూవీ రీ రిలీజ్

    ర‌వితేజ న‌టించిన సూప‌ర్ హిట్ చిత్రం ‘వెంకీ’ని రీరిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తున్నారు. 2004లో వ‌చ్చిన ఈ మూవీని జూన్ 14న రీరిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు మేక‌ర్స్ పేర్కొన్నారు. 4Kలో ఈ మూవీ విడుద‌ల కానుండ‌డంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. స్నేహ హీరోయిన్‌గా నటించిన ఈ కామెడీ ఎంటర్‌టైన‌ర్‌లో అశుతోష్ రాణా, బ్రహ్మానందం కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

  • మరోసారి సందడి చేయనున్న ‘బెల్లా’

    ధనవంతురాలైన ఓ మహిళ తన సంపదను కోల్పోయిన తర్వాత ఆమె జీవితం ఎలాంటి మలుపు తిరిగిందనే కథాంశం ఆధారంగా రూపొందిన సిరీస్‌ ‘కాల్‌ మి బె’. బాలీవుడ్‌ నటి అనన్యపాండే ప్రధాన పాత్ర పోషించిన ఈ సిరీస్‌ గతేడాది విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. ఇప్పుడు దీనికి సీక్వెల్‌గా ‘కాల్‌ మి బె 2’ను రూపొందిస్తున్నారు. మొదటి భాగంలో బెల్లా పాత్రలో కనిపించిన అనన్య.. ఈసారి ఎలాంటి మ్యాజిక్‌ చేస్తుందో చూడాలి.

     

  • సోనాక్షి సిన్హా దహాద్‌ 2.. సన్నాహాలు

    పబ్లిక్‌ టాయిలెట్స్‌లో అనుమానాస్పదంగా చనిపోయిన కొందరి మహిళల హత్య చుట్టూ తిరిగే కథనంతో రూపొంది మంచి విజయాన్ని అందుకుంది ‘దహాద్‌’ వెబ్‌సిరీస్‌. రీమా కగ్టీ, జోయా అక్తర్‌ రూపొందించిన ఈ సిరీస్‌లో బాలీవుడ్‌ నటి సోనాక్షి సిన్హా నటించింది. ఇప్పుడీ క్రైమ్‌ థ్రిల్లర్‌ సిరీస్‌కు సీక్వెల్‌ రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ‘దహాద్‌ 2’కు సంబంధించిన స్క్రిప్ట్‌ పనులు ప్రారంభమైనట్లు సమాచారం.

  • పా.రంజిత్‌ తెరకెక్కిస్తున్న వెబ్ సిరీస్‌లో జాన్వీ?

    తమిళ దర్శకుడు పా.రంజిత్‌ తెరకెక్కిస్తున్న ఓ వెబ్‌సిరీస్‌లో జాన్వీ కపూర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నట్లు సమాచారం. మహిళా ప్రాధాన్య కథతో రూపొందుతున్న ఈ సిరీస్‌లో అణచివేత, సామాజిక సమస్యలే ప్రధాన కథాంశంగా ఉండనున్నాయి. జులైలో చిత్రీకరణ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నారు. కొన్ని నెలలుగా పా.రంజిత్‌తో ఈ విషయంపైనే చర్చలు చేస్తున్నట్లు జాన్వీ సన్నిహిత వర్గాలు తెలిపాయి.

  • నెపోటిజంపై రానా కామెంట్స్

    రానా నాయుడు సీజన్-2 ప్రమోషన్స్‌లో భాగంగా ఓ ఇంటర్వూలో నెపోటిజంపై ప్రశ్నించగా రానా స్పందించాడు. ‘మీ కుటుంబం ఏ ఇండస్ట్రీలో ఉంటుందో దాని గురించి మీకు ఎక్కువ తెలుస్తుంది. అది ప్లస్ ఎలా అవుతుంది? కెమెరా ముందు నిల్చొని యాక్ట్ చేయాల్సిందే కదా? మాఅమ్మ ఫిల్మ్ ల్యాబ్‌లో పనిచేశారు కాబట్టి అక్కడ పనిగురించి తెలుసుకున్నా. మానాన్నకు స్టూడియో ఉంది కాబట్టి అది నేను చేస్తా’ అని చెప్పుకొచ్చారు.