Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • మంచు ల‌క్ష్మి ‘దక్ష’ టీజర్ చూశారా?

    ఐదేళ్ల తరువాత నటి మంచు ల‌క్ష్మి ‘దక్ష’ మూవీతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వంశీకృష్ణ దర్శకుడు. ఇందులో మంచు ల‌క్ష్మి డైనమిక్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనుండగా.. మంచు మోహన్‌బాబు, సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ల‌క్ష్మి ప్రసన్న పిక్చర్స్ బ్యానర్‌లో పదేళ్ల తరువాత ‘ద‌క్ష’ సినిమా రిలీజ్ కానుంది. వినాయ‌క చ‌వితి సందర్భంగా బుధవారం ఈ మూవీ టీజ‌ర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

     

  • భర్తతో గణపయ్య పూజలో మెగా కోడలు

    మెగా కోడలు లావణ్య త్రిపాఠి త్వరలోనే తల్లి కాబోతోంది. నేడు వినాయక చవితి సందర్భంగా ఓ స్పెషల్‌ ఫోటో షేర్‌ చేసింది. అందులో భర్త వరుణ్‌ తేజ్‌తో కలిసి గణపయ్య ముందు కూర్చుంది. వరుణ్‌ నేలపై కూర్చోగా.. లావణ్య ప్రెగ్నెంట్‌ కావడంతో కుర్చీపై కూర్చుని దేవుడికి నమస్కరిస్తోంది. అదే సమయంలో కెమెరావైపు చూస్తూ చిరునవ్వులు చిందిస్తోంది. ఇందులో లావణ్య బేబీ బంప్‌ స్పష్టంగా కనిపిస్తోంది.

  • చీరకట్టులో అందాల మళవిక మోహనన్

    హీరోయిన్ మాళవిక మోహనన్ తాజాగా చీరకట్టులో ఉన్న ట్రెడిషనల్ ఫోటోలు నెట్టింట పోస్ట్ చేసింది. ఈ అమ్మడు ఓ వైపు పద్దతిగా ఆకట్టుకుంటూనే తన అందాలతో ఆకర్షిస్తోంది.

  • ‘మిరాయ్’ ట్రైలర్‌కు టైమ్ ఫిక్స్!

    హీరో తేజ సజ్జా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘మిరాయ్’. ఈ మూవీ ట్రైలర్‌ను రేపు మధ్యాహ్నం 12.06గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ తాజాగా ప్రకటించారు.

  • Video: ఒక చిన్న ప్రేమ కథ చెప్తా.. ‘మోగ్లీ’ కోసం నాని!

    రోషన్ కనకాల హీరోగా సందీప్ రాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోగ్లీ’. ఇందులో బాలీవుడ్ బ్యూటీ సాక్షి మడోల్కర్ హీరోయిన్‌. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా నుంచి మేకర్స్ తాజాగా ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇచ్చారు. ‘మోగ్లీ’ కోసం నేచురల్ స్టార్ నాని అంటూ ఆగస్టు 29న ఆయన నరేట్ చేసిన గ్లింప్ రాబోతున్నట్లు వెల్లడించారు. దీనికి సంబంధించిన ఓ వీడియోను షేర్ చేశారు.

  • పుష్ప-2 థీమ్‌తో భారీ మండపం.. గంగమ్మ గెటప్‌లో వినాయకుడు

    తమిళనాడులోని డెంకానికొట్టాయ్‌లో వినాయక చవితి సందర్భంగా ‘పుష్ప-2’ థీమ్‌తో ఓ భారీ మండపాన్ని ఏర్పాటు చేశారు. సుమారు రూ.30 లక్షల వ్యయంతో, ఎర్రచందనం దుంగల సెట్టింగ్‌తో దీనిని నిర్మించారు. ఇక్కడ గంగమ్మ జాతర గెటప్‌లో ఉన్న వినాయకుడి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. మండపం ప్రవేశ ద్వారం వద్ద హెలికాప్టర్‌తో ఉన్న పుష్పరాజ్ విగ్రహం అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.

  • రామ్‌చరణ్ ‘పెద్ది’ నుంచి బిగ్ అప్‌డేట్!

    రామ్‌చరణ్-జాన్వీకపూర్ జంటగా దర్శకుడు బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం ‘పెద్ది’. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అయితే ఇటీవల టాలీవుడ్‌లో సమ్మె కారణంగా కొంచెం బ్రేక్ పడింది.. కానీ మళ్ళీ ‘పెద్ది’ మేకర్స్ షూటింగ్ కోసం రంగం సిద్ధం చేస్తున్నారట. నెక్ట్స్ షెడ్యూల్ కోసం మేకర్స్ మైసూరు పయనమయినట్టు సమాచారం. అంతేకాదు ఈ షెడ్యూల్‌లో మీర్జాపూర్ నటుడు దివ్యెందు శర్మ కూడా పాల్గొననున్నట్టు తెలుస్తోంది.

  • లైవ్‌ ఈవెంట్‌లో కుప్పకూలిన నటుడు, వెంటిలేటర్‌పై చికిత్స

    మాలీవుడ్ నటుడు, టెలివిజన్ ప్రెజెంటర్ రాజేష్ కేశవ్ (RK) గుండెపోటుతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉంది. ఆదివారం రాత్రి కొచ్చిలో ఒక లైవ్ ఈవెంట్‌లో కుప్పకూలిపోయిన ఆయన్ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఇంటెన్సివ్ కేర్ యూనిట్‌లో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. రాబోయే 72 గంటలు చాలా క్లిష్టమైనవని వైద్యులు తెలిపారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులు ప్రార్థిస్తున్నారు.

     

  • ‘బాహుబలి:ది ఎపిక్‌’.. ఆ సీన్స్‌ కట్‌!

    ‘బాహుబలి’ 2భాగాలను కలిపి ‘బాహుబలి:ది ఎపిక్‌’గా అక్టోబర్‌ 31న విడుదలకానుంది. అయితే అందులోని ఏ సీన్స్ కట్‌ చేస్తారా? అని అందరిలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ రాజమౌళి క్లారిటీ ఇచ్చారు. ‘‘రెండూ కలిపి దాదాపు 5:27గంటల రన్‌టైమ్‌ ఉన్నాయి. ఇందులో ‘కన్నా నిదురించరా’ పాటను, ప్రభాస్‌-తమన్నా మధ్య సాగే కొన్ని రొమాంటిక్‌ సన్నివేశాలను కూడా తొలగించాలని నిర్ణయించుకున్నాం’’ అని రాజమౌళి తెలిపారు.

  • ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’ నుంచి మరో సాంగ్ రిలీజ్

    నాగశౌర్య హీరోగా రానున్న సినిమా ‘బ్యాడ్‌ బాయ్‌ కార్తీక్‌’. రమేష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో విధి హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ సినిమాలోని సెకండ్ సింగిల్‌ రిలీజ్‌ చేశారు. ‘మై డియర్ జనతా’ అంటూ సాగే ఈ లిరికల్ వీడియో సాంగ్‌ను హేమచంద్ర ఆలపించగా.. హరీష్ జైరాజ్ సంగీతం అందించాడు.