Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ఇట్స్‌ అఫీషియల్‌..: లోకేశ్‌ కనగరాజ్‌తో బాలీవుడ్‌ స్టార్‌ సినిమా

    దర్శకుడు లోకేశ్‌ కనగరాజ్‌తో సినిమా చేస్తున్నట్లు బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్‌ ఖాన్‌ తెలిపారు. వచ్చే ఏడాదిలో ఈ మూవీ పట్టాలెక్కుతుదని వెల్లడించారు.

  • ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా?

    పవన్‌ కల్యాణ్‌ ఫ్యాన్స్‌కు మరోసారి నిరాశ ఎదురైంది. పవన్ హీరోగా నటించిన ‘హరిహర వీరమల్లు’ మరోసారి వాయిదా పడినట్లు తెలుస్తోంది. ఈనెల 12న విడుదల కావాల్సిన ఈ సినిమా పోస్ట్‌పోన్ చేశారని వార్తలొస్తున్నాయి. అయితే దీనికి ప్రధాన కారణం వీఎఫ్‌ఎక్స్‌తో పాటు ఆర్థికపరమైన సమస్యలేనని సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే పలుసార్లు వాయిదా పడడంతో డిస్ట్రిబ్యూటర్స్ వెనకడుగు వేస్తున్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది.

  • ప్రియుడిని పెళ్లాడిన ప్రముఖ నటి

    ప్రముఖ హిందీ టీవీ నటి హీనా ఖాన్ పెళ్లిపీటలు ఎక్కారు. చిరకాల ప్రియుడు రాకీ జైస్వాల్‌ను వివాహం చేసుకున్నారు. బుధవారం సాయంత్రం జరిగిన తన వివాహ వేడుక అనేక ఫోటోలను సోషల్‌మీడియాలో పంచుకున్నారు. ‘‘రెండు వేర్వేరు ప్రపంచాల నుంచి ప్రేమను నిర్మించాం. తేడాలు పోయాయి. హృదయాలు కలిశాయి. జీవితాంతం బంధాన్ని పెనవేశాయి. అన్ని అడ్డంకులను అధిగమించి ముందుకు సాగుతాం’’ అని సంతోషం వ్యక్తం చేశారు.

  • సంక్రాంతికి పెరుగుతోన్న పోటీ

    సంక్రాంతి పండుగకు ఇప్పటినుంచే స్టార్‌, యువ హీరోలు సన్నద్ధమవుతున్నారు. సినిమా చిత్రీకరణ దశలో ఉండగానే రిలీజ్‌ సమయాన్ని ప్రకటించేసి పండక్కి పోటీ పెంచేశారు. నవీన్‌ పొలిశెట్టి ‘అనగనగా ఒక రాజు’ మూవీ జనవరి 14న విడుదల కానుంది. అలాగే, చిరంజీవి హీరోగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కనున్న మూవీ, రవితేజ 76వ సినిమా కూడా సంక్రాంతికి విడుదల కానున్నాయి.

  • సంక్రాంతి బరిలో ‘అనగనగా ఒక రాజు’

    ‘అనగనగా ఒక రాజు’తో సంక్రాంతి బరిలో సందడి చేయనున్నారు నవీన్‌ పొలిశెట్టి . ఆయన హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మారి తెరకెక్కిస్తున్నారు. చిత్రీకరణ దశలో ఉన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదల చేయనున్నాట్లు టీమ్‌ ఇటీవల ప్రకటించింది. ఆద్యంతం వినోదంతో నిండిన ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నారు.

  • పళనిలో సూర్య పూజలు

    సూర్య హీరోగా దర్శకుడు వెంకీ అట్లూరి ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. తాజాగా ఈ చిత్రబృందం పళని మురుగన్‌ దేవాలయాన్ని సందర్శించింది.

  • హ్యట్సాఫ్ ప్రీతి జింటా

    సినీ నటి ప్రీతి జింటా గురించి ఓ ఇంట్రెస్టింగ్‌ విషయం సోషల్‌మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆమె 34 మంది అమ్మాయిలను దత్తత తీసుకునివారి బాగోగులు చూసుకుంటుంది. తనకు కవలలు జన్మించకముందే 3 4మందికి తల్లిగా మారినట్లు ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. వారి చదువు, ఆహారం, బట్టలు తదితర విషయాలన్నీ తానే చూసుకుంటానని తెలిపారు. కాగా, IPLలో పంజాబ్ జట్టుకు ప్రీతి జింటా ఓనర్.

  • రవితేజ కొత్త చిత్రం ప్రారంభం.. రిలీజ్‌ ఎప్పుడంటే..?

    తిరుమల కిషోర్‌ దర్శకత్వంలో రవితేజ హీరోగా కొత్త సినిమా ప్రారంభం కానుంది. సంక్రాంతి కానుకగా మూవీని విడుదల చేస్తామని టీమ్‌ వెల్లడించింది.

  • ‘థగ్ లైఫ్’ రివ్యూ.. నెటిజన్లు ఏమంటున్నారంటే?

    కమల్‌హాసన్ హీరోగా మణిరత్నం దర్శకత్వం వహించిన సినిమా ‘థగ్ లైఫ్’ ఇవాళ థియేటర్లలోకి వచ్చింది. మూవీ చూసినోళ్లు చాలా బావుందని కామెంట్స్ చేస్తున్నారు. ఓవర్సీస్ నుంచి డివైడ్ టాక్ వచ్చింది. మణిరత్నం రొటీన్ రివెంజ్ డ్రామా తీశారని పేర్కొంటున్నారు. ఇంటర్వెల్ ఫైట్ బావున్నా… సెకండాఫ్ ఫ్లాట్‌గా ఉందని చెబుతున్నారు. అమెరికా, యూకే నుంచి మిక్స్డ్ టాక్ లభించింది.

  • అనుష్క పోస్టర్ కారణంగా 40 యాక్సిడెంట్లు.. రంగంలోకి దిగిన పోలీసులు..చివరికి!

    ‘వేదం’  మూవీ 15 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో దర్శకుడు క్రిష్‌ ఆసక్తికర విషయాలు చెప్పారు. ‘‘మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా అనుష్క వెనక్కి తిరిగి కొంటెగా చూస్తున్న పోస్టర్‌ను పెద్ద హోర్డింగ్‌గా చేసి పంజాగుట్ట సర్కిల్‌లో పెట్టాం. ఆ సమయంలో 40కి పైగా ప్రమాదాలు జరిగాయి. పోలీసులకు ఫిర్యాదు అందడంతో ఆ తర్వాత పోస్టర్‌ను తొలగించాం’’ అని అన్నారు.