Category: ఎంటర్‌టైన్‌మెంట్

  • ‘JVAS’ కోటులో జాన్వీకపూర్!

    బాలీవుడ్ బ్యూటీ జాన్వీకపూర్ తన ఇన్‌స్టాలో ఇంట్రెస్టింగ్ పిక్స్ షేర్‌చేసింది. ఇందులో ఆమె ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ కోటు ధరించి మురిసిపోతోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

  • ‘SSMB29’.. కొత్త షెడ్యూల్ అప్‌డేట్?

    సూపర్‌స్టార్ మహేష్ బాబు-దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న ‘SSMB29’ మూవీ గురించి ఆసక్తికర వార్త నెట్టింట వైరల్ అవుతోంది. సమ్మర్ వెకేషన్ అనంతరం ఈ సినిమా షూటింగ్ మరో కీలక షెడ్యూల్‌తో ప్రారంభం కానుందట. జూన్ 10 నుంచి వారాణసిలోని సెట్స్‌లో ఈ షెడ్యూల్ మొదలవనుందని తెలుస్తోంది. ఈ షెడ్యూల్‌లో కీలక సన్నివేశాలను చిత్రీకరించేందుకు రాజమౌళి బృందం సన్నాహాలు చేస్తోందని సినీవర్గాల సమాచారం.

     

  • గుర్రంపై హీరోయన్ రొమాన్స్.. పోస్టర్‌ వైరల్!

    షానయా కపూర్-విక్రాంత్ మస్సే‌ జంటగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ ‘ఆంఖోంకి గుస్తాఖియాన్’. సంతోష్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం జూలై 11న థియేటర్స్‌లోకి రాబోతుంది. తాజాగా మేకర్స్ మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ పోస్టర్‌ను షానయా తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో అది కాస్త వైరల్‌గా మారింది. ఇందులో టీజర్ రేపు విడుదల కాబోతున్నట్లు వెల్లడించింది.

  • థియేటర్‌లో ‘అందాల రాక్షసి’ మళ్లీ సందడి

    నవీన్ చంద్ర, రాహుల్ రవీంద్రన్, లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘అందాల రాక్షసి’. 2012 వచ్చిన ఈమూవీ ఈనెల 13న థియేటర్స్‌లో రీ-రిలీజ్ కాబోతుంది.

  • గోల్డ్ కలర్‌ డ్రెస్‌లో మెరిసిపోతున్న మీనాక్షి!

    హీరోయిన్ మీనాక్షిచౌదరి తన లేటెస్ట్ ఫొటోలను సోషల్‌మీడియాలో పంచుకుంది. ఇందులో ఆమె గోల్డ్ కలర్ డ్రెస్‌లో మెరిసిపోతోంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైలర్ అవుతున్నాయి.

  • ఇకపై ఎవరినైనా అలానే పిలుస్తా: రాజేంద్ర ప్రసాద్‌

    సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్‌ ఇటీవల ఓ ఈవెంట్‌లో కమెడియన్ అలీపై చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశమైన సంగతి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై తాజాగా ఓ ఇంటర్వ్యూలో రాజేంద్రప్రసాద్‌ స్పందించారు. ఆయన మాట్లాడుతూ.. ఇకపై ఎవరినీ నువ్వు అని సంబోధించనని.. మీరు అనే పిలుస్తానని అన్నారు.

  • ప్రియమణి ‘గుడ్ వైఫ్’పై అప్‌డేట్.. ఆసక్తిగా పోస్టర్!

    హీరోయిన్ ప్రియమణి ప్రస్తుతం ‘గుడ్ వైఫ్’ సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకు రానుంది. దీన్ని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, బెంగాలీ, మరాఠీ భాషల్లో అందుబాటులోకి తీసుకువస్తున్నారు. ఇందులో ప్రియమణి లాయర్‌గా నటిస్తుండగా.. ఆమె భర్త పాత్రలో సంపత్ రాజ్ కనిపించనున్నారు. ఈ సిరీస్ స్ట్రీమింగ్ హక్కులు జియోహాట్ స్టార్ సొంతం చేసుకోగా.. త్వరలోనే స్ట్రీమింగ్‌కు రాబోతున్నట్లు పోస్టర్ ద్వారా ప్రకటించారు.

  • అందుకే ఆ సిరీస్‌లో నటించలేదు: స్టార్ హీరోయిన్

    ‘లస్ట్ స్టోరీస్’.. బాలీవుడ్‌లో బోల్డ్ వెబ్‌సిరీస్‌గా తెరకెక్కి సూపర్‌హిట్ అందుకుంది. అయితే ఇందులో కియారాఅద్వానీ పాత్రకు మొదట కృతిసనన్‌ను అనుకున్నారట. కానీ ఆమె రిజెక్ట్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో కృతి ఈ విషయంపై స్పందిస్తూ.. ‘‘‘లస్ట్ స్టోరీస్‌లో కియారా పాత్రను నేను తిరస్కరించాను. ఎందుకంటే అలాంటి పాత్రలో నటించడం నా తల్లిదండ్రులకు నచ్చలేదు. అందుకే ఆ అవకాశాన్ని వదులుకున్నాను’’ అని చెప్పుకొచ్చింది.

  • రవితేజ ‘RT76’ మూవీకి డేట్ ఫిక్స్.. పోస్టర్ రిలీజ్!

    రవితేజ తన నెక్స్ట్ మూవీని దర్శకుడు కిషోర్ తిరుమల డైరెక్షన్‌లో చేయబోతున్నాడు. ఈ సినిమాను రేపు ఉ.9.02గంటలకు పూజా కార్యక్రమాలతో ప్రారంభించనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

  • హృదయాన్ని హత్తుకునేలా.. ‘డియర్‌ డాడీ’ ట్రైలర్‌

    ప్రముఖ ఓటీటీ ‘ఈటీవీ విన్‌’ కథాసుధ పేరుతో ప్రతి ఆదివారం ఒక కొత్త కథను పరిచయం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఈ ఆదివారం (జూన్‌ 8) ‘డియర్‌ డాడీ’ రానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను తాజాగా రిలీజ్‌ అయింది. తండ్రీకూతుళ్ల అనుబంధం ఇతివృత్తంగా సాగే ఈ షార్ట్‌మూవీ ట్రైలర్‌ హృదయాన్ని హత్తుకునేలా ఉంది. ఈ చిత్రాన్ని దేవరకొండ శ్రీకాంత్ రూపొందించాడు.