నటుడు, మక్కల్ నీది మయ్యం పార్టీ అధినేత కమల్హాసన్ కన్నడ భాషపై చేసిన వ్యాఖ్యలు తీవ్రదుమారం రేపాయి. ఈ ఎఫెక్ట్ ఆయన రాజ్యసభ సీటు నామినేషన్పై పడింది. ఈక్రమంలో ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసుకున్నట్లు సమాచారం. త్వరలో కమల్ ‘థగ్ లైఫ్’ సినిమా రిలీజ్కానుంది. ఆ రిలీజ్ వ్యవహారం పూర్తయిన తర్వాతే నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు సంబంధితవర్గాలు పేర్కొన్నాయి.
Category: ఎంటర్టైన్మెంట్
-
అవార్డుల వేడుకలో ఆడిపాడిన రష్మిక.. వీడియో!
నేషనల్ క్రష్ రష్మిక మందన్న తాజాగా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ‘జీ సినీ అవార్డ్స్ 2025’ గురించి పోస్ట్ చేసింది. ‘‘‘జీ సినీ అవార్డ్స్ 2025’లో నా ప్రదర్శన మీ కోసం. జూన్ 7న సా.7:30 గంటలకు జీ సినిమా, జీ టీవీ అండ్ జీ5లో మారుతి సుజుకి అందించే 23వ ‘జీ సినీ అవార్డ్స్ 2025’లో నన్ను ప్రత్యక్షంగా చూడండి’’ అంటూ తను డ్యాన్స్ చేస్తోన్న వీడియో ప్రోమో పంచుకుంది.
-
‘లక్ష్మీ నరసింహ’ రీ-రిలీజ్ ట్రైలర్ చూశారా?
ప్రస్తుతం టాలీవుడ్లో రీ-రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ-ఆసిన్ జంటగా నటించిన ‘లక్ష్మీ నరసింహ’ మూవీ మరోసారి థియేటర్లోకి రానుంది. జూన్ 8న థియేటర్స్లో విడుదల కాబోతుంది. పరాన్జీ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా 2000లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్గా నిలిచింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రీ-రిలీజ్ ట్రైలర్ను మేకర్స్ రిలీజ్ చేశారు.
-
‘వీరమల్లు’ విడుదల.. పవన్ కల్యాణ్ కీలక నిర్ణయం
పవన్కల్యాణ్ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘హరిహర వీరమల్లు’.. జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా పవన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నిర్మాత ఏ.ఎం.రత్నంను ఆదుకునేందుకే సినిమాకు తీసుకున్న అడ్వాన్స్ రెమ్యునరేషన్ రూ. 11 కోట్లను పవన్ కల్యాణ్ తిరిగి ఇచ్చారు. తాను ఎలాంటి పరిస్థితుల్లో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో పవన్ కళ్యాణ్ ముందు ఉంటాడని మరోసారి నిరూపించారని ఫ్యాన్స్ చెబుతున్నారు.
-
ప్రశాంత్ నీల్కు స్టార్ హీరోల విషెస్
సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు ఎన్టీఆర్, ప్రభాస్లు విషెస్ చెప్పారు. ‘మీ మాటల కంటే.. మీ విజన్ ఎక్కువగా మాట్లాడుతుంది. తెరపై మీ మ్యాజిక్ చూసేందుకు సిద్ధంగా ఉన్నాం’ అని ఎన్టీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘హ్యాపీ బర్త్డే మై సలార్. సలార్ పార్ట్-2లో మరింత విధ్వంసం చేయడానికి ఎదురుచూస్తున్నా. లవ్యూ’’ అని ఇన్స్టాలో ప్రభాస్ పోస్ట్ పెట్టారు.
-
సిద్ధూ జొన్నలగడ్డ గొప్ప మనసు.. సగం రెమ్యూనరేషన్ వెనక్కి ఇచ్చిన హీరో!
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ, వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ‘జాక్’. ఇటీవల విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో సిద్ధూ గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఈ సినిమాకు ఆయన రూ.8 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నారట. అయితే, సినిమా విజయం సాధించకపోవడంతో అందులో సగం పారితోషికాన్ని(రూ.4 కోట్లు) వెనక్కి ఇచ్చేయాలని నిర్ణయించుకున్నారు.
-
హార్డ్డిస్క్ ఇంకా నా చేతికి రాలేదు.. మరోసారి స్పందించిన మంచు విష్ణు
మంచు విష్ణు న్యూ మూవీ ‘కన్నప్ప’ జూన్ 27న రిలీజ్ కానుంది. తాజాగా ఇంటర్వ్యూలో ‘కన్నప్ప’చిత్రం హార్డ్డిస్క్ మాయంపై విష్ణు స్పందించారు. ‘‘ఇంకా అది నా చేతికి రాలేదు. పాస్వర్డ్ ఉంది కాబట్టి సేఫ్ అనుకుంటున్నా. కానీ, ఏ పాస్వర్డ్ అయినా.. 99శాతం మాత్రమే సేఫ్. 100 శాతం సేఫ్ కాదు’’అని తెలిపారు.ఇంత గొప్ప సినిమా పూర్తి చేశానంటే అది శివలీల అని అన్నారు.
-
భట్టి విక్రమార్కను కలిసిన నటుడు నాగార్జున
TG: డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను నటుడు నాగార్జున కలిశారు. తన కుమారుడు అఖిల్ పెళ్లిశుభలేఖను భట్టికి ఇచ్చి.. వివాహానికి రావాలని ఆహ్వానించారు.
-
కమల్హాసన్ రాజ్యసభ నామినేషన్ వాయిదా
‘థగ్ లైఫ్’ సినిమా ఈవెంట్లో కన్నడ భాషపై MNM పార్టీ అధినేత, నటుడు కమల్ హాసన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం రేగింది. ఈ భాషా వివాదం నేపథ్యంలో ఆయన రాజ్యసభ స్థానానికి నామినేషన్ దాఖలు చేయడాన్ని వాయిదా వేసుకున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. త్వరలో విడుదల కాబోయే తన చిత్రం ‘థగ్ లైఫ్’ వ్యవహారాలు పూర్తయిన తర్వాతే నామినేషన్ వేయాలని భావిస్తున్నట్లు తెలిపాయి.
-
18 గంటలు పనిచేశాను: మీర్జాపూర్ నటుడు త్రిపాఠి
వర్కింగ్ అవర్స్ గురించి మీర్జాపూర్ నటుడు పంకజ్ త్రిపాఠి మాట్లాడారు. తాను కొన్నిసార్లు 18 గంటలు పనిచేశానని వెల్లడించారు.