ఏపీ సీఎం చంద్రబాబును హీరో నాగార్జున కలిశారు. తన కొడుకు అఖిల్ వివాహానికి చంద్రబాబును నాగార్జున ఆహ్వానించారు.
ఏపీ సీఎం చంద్రబాబును హీరో నాగార్జున కలిశారు. తన కొడుకు అఖిల్ వివాహానికి చంద్రబాబును నాగార్జున ఆహ్వానించారు.
వెంకటేశ్, రానా కీలక పాత్రల్లో నటిస్తున్న ‘రానా నాయుడు: సీజన్2’ ట్రైలర్ మంగళవార విడుదలైంది. ఈ క్రేజీ సిరీస్కు కరణ్ అన్షుమాన్, సుపర్ణ్ వర్మ, అభయ్ చోప్రా దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ఫ్లిక్స్లో జూన్ 13వ తేదీ నుంచి హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
మంచు విష్ణు న్యూ మూవీ ‘కన్నప్ప’జూన్ 27న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో విష్ణు ‘మై కన్నప్ప స్టోరీ’అంటూ వీడియో విడుదల చేశారు. ఇందులో మోహన్ బాబు గురించి చెప్పారు.ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి వారిని పెంచారని వివరించారు.నెటిజన్లను కూడా వారి జీవితంలో కన్నప్ప ఎవరో వివరిస్తూ #My Kannappa Story అనే హ్యాష్ ట్యాగ్ జోడిస్తూ వీడియో పంపాల్సిందిగా కోరారు.
8 గంటలు మాత్రమే పనిచేయాలనే డిమాండ్కు దర్శకుడు మణిరత్నం మద్దతిచ్చారు. నటీనటులు అలా డిమాండ్ చేయడంలో తప్పులేదని వెల్లడించారు.
ప్రభాస్ హీరోగా దర్శకుడు మారుతీ తెరకెక్కిస్తోన్న చిత్రం ‘ది రాజా సాబ్’. భారీ అంచనాల మధ్య రానున్న ఈ మూవీ అప్డేట్ గురించి అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఈ సినిమా టీజర్ జూన్ 16న రానున్నట్లు మేకర్స్ తెలిపారు. అలాగే డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా సినిమా విడుదల కానున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఓ పోస్టర్ను పంచుకుంది.
నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్తో దర్శకుడు శైలేశ్ కొలను సినిమా చేయనున్నట్లు టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్కు సంబంధించిన చర్చలు జరుగుతున్నట్లు సమాచారం.
రిస్క్ తీసుకొని ఎన్నో సినిమాలు చేశానని బాలీవుడ్ హీరో ఆమిర్ ఖాన్ చెప్పారు. అవే మంచి పేరు తీసుకొచ్చాయని వెల్లడించారు.
ఇటీవల ఓ కార్యక్రమంలో అలీ, రోజాపై చేసిన నటుడు రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారాయి. దీనిపై రాజేంద్ర ప్రసాద్ స్పందించారు. ‘‘ఈ మధ్య ఓ కార్యక్రమంలో నేను పరిచయం చేసిన హీరోయిన్, యాక్టర్ గురించి సరదాగా మాట్లాడాను. వాటిని తప్పుగా అనుకున్నారు. నేను ఇలానే ఉంటాను. ఎందుకంటే అన్నయ్యను కాబట్టి. అందులో తప్పేం లేదు’’అని రాజేంద్ర ప్రసాద్ చెప్పారు.
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్, మంచు మనోజ్ నటించిన సినిమా ‘భైరవం’. ఈ మూవీలో అదితి శంకర్, ఆనంది, దివ్య పిళ్లై కీలక పాత్రలు పోషించారు. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ సినిమా మే30న విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సక్సెస్ సంబరాలు చేసుకుంది.
జీవితంలో ఒడుదొడుకులు సహజం అని సినీ నటి రష్మిక అన్నారు. ఏదీ శాశ్వతం కాదని తెలుసుకుంటే ఒత్తిడి ఉండదని వెల్లడించారు.