అల్లు అర్జున్-అట్లీ కాంబోలో ‘AA22’ సినిమా తెరకెక్కనుంది. భారీ బడ్జెట్తో, అత్యున్నత సాంకేతికతతో ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ మూవీపై నిర్మాత బన్ని వాస్ ఆసక్తికర అప్డేట్ ఇచ్చారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఆయన.. ‘‘సన్ పిక్చర్స్ వాళ్లతో నాన్ డిస్క్లోజర్ అగ్రిమెంట్ ఉంది. ప్రస్తుతం ఈ సినిమాపై ఏమీ మాట్లాడలేను. ఏదైనా అప్డేట్ ఉంటే వాళ్లే చెప్పాలి’’ అని తెలిపారు.
Category: ఎంటర్టైన్మెంట్
-
ఓటీటీలోకి ‘కింగ్డమ్’
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘కింగ్డమ్’ ఓటీటీలో స్ట్రీమింగ్కు సిద్ధమైంది. ఈ నెల 27 నుంచి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి రానుంది.
-
‘ఫ్యూచర్ దళపతి’ ట్యాగ్పై స్పందించిన శివ కార్తికేయన్
కొందరు అభిమానులు తనను ‘ఫ్యూచర్ దళపతి’ అని పిలవడంపై నటుడు శివ కార్తికేయన్ స్పందించారు. ఈ ట్యాగ్పై స్పందిస్తూ, “అన్న ఎప్పుడూ అన్నే.. తమ్ముడు ఎప్పుడూ తమ్ముడే” అని వ్యాఖ్యానించారు. విజయ్ను ఆయన అభిమానులు ప్రేమగా ‘దళపతి’ అని పిలుచుకుంటారన్న సంగతి తెలిసిందే. శివ కార్తికేయన్ వ్యాఖ్యలు విజయ్పై ఆయనకు ఉన్న గౌరవాన్ని, అభిమానాన్ని సూచిస్తున్నాయి.
-
యశ్ మూవీ.. రంగంలోకి దిగిన హాలీవుడ్ స్టంట్ డైరెక్టర్
యశ్ హీరోగా దర్శకుడు గీతూ మోహన్దాస్ తెరకెక్కిస్తున్న సినిమా ‘టాక్సిక్’. ముంబైలో.. హాలీవుడ్కు చెందిన జె.జె. పెర్రీ ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కిస్తున్నారు.
-
జనాలు ఇన్స్టాగ్రామ్లో బిజీ బిజీ: బన్నీవాసు
జనాలు ఇన్స్టాగ్రామ్లో నిమగ్నమైపోయారని, ఇప్పుడు సినిమాలు తీసిన తర్వాత ప్రజల దగ్గరకు వెళ్లి “బాబూ మేము సినిమాలు తీశాం” అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని నిర్మాత బన్నీ వాసు అన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో సినిమా ప్రమోషన్లు పూర్తిగా మారిపోయాయని ఆయన వ్యాఖ్యానించారు. సినిమాను ప్రేక్షకులకు చేరువ చేయడంలో సరికొత్త సవాళ్లు ఎదురవుతున్నాయని, ఈ మార్పులకు అనుగుణంగా ప్రచార వ్యూహాలను మార్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన వివరించారు.
-
‘అర్జున్ రెడ్డి’కి 8 ఏళ్లు.. డైరెక్టర్ ఆసక్తికర పోస్ట్!
విజయ్ దేవరకొండ-సందీప్ రెడ్డి వంగా కాంబోలో వచ్చిన ‘అర్జున్ రెడ్డి’ సినిమా విడుదలై నేటికి 8ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా దర్శకుడు ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. ‘‘ఎనిమిదేళ్ల క్రితం ‘అర్జున్ రెడ్డి’ నా జీవితాన్ని శాశ్వతంగా మార్చేసింది. ఈ సినిమాలోని ప్రతి ఫ్రేమ్, ప్రతి డైలాగ్, ప్రతి ఎమోషన్కు ఒక అర్థం వచ్చిందంటే, దాన్ని మీరు నిజాయతీగా స్వీకరించడమే కారణం’’ అని రాసుకొచ్చారు.(వీడియో)
-
ఈ వారం థియేటర్-ఓటీటీ చిత్రాలివే!
ఈ వారం థియేటర్, ఓటీటీలో పలు ఆసక్తికర చిత్రాలు అలరించనున్నాయి. అవేంటో తెలుసుకుందాం.
- ‘సుందరకాండ’ (ఆగస్టు 27 విడుదల)
- ‘త్రిబాణధారి బార్బరిక్’ (29 ఆగస్టు)
- ‘పరమ్ సుందరి’ (ఆగస్టు 29)
- ‘కన్యాకుమారి’ (ఆగస్టు 27)
- నెట్ఫ్లిక్స్: ‘అబిగైల్’ (ఆగస్టు 26)
- అమెజాన్ ప్రైమ్:‘అప్లోడ్ 4’ (ఆగస్టు 25)
- జియో:‘రాంబో ఇన్ లవ్’ (ఆగస్టు 29)
-
కమర్షియల్ చిత్రాల్లో 1000 తప్పులు ఉన్నా పట్టించుకోరు కానీ..: అనుపమ
‘పరదా’ మూవీ సక్సెస్ మీట్లో నటి అనుపమ పరమేశ్వరన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘నేను నటించిన వాటిలో ‘పరదా’ నాకు చాలా ఇష్టం. ‘పరదా’ని ఓ ప్రయోగాత్మక చిత్రంగా పేర్కొంటూనే కొందరు అందులో తప్పులు వెతుకుతున్నారు. కమర్షియల్ చిత్రంలో 1000 తప్పులు ఉన్నా పట్టించుకోరు. కానీ, హీరోయిన్ ప్రాధాన్యత చిత్రాల విషయంలో పరిస్థితి భిన్నంగా ఉంటుంది’’ అని అన్నారు.
-
కార్మికుల సమ్మె.. అల్లు అర్జున్ సినిమాపై ప్రభావం: బన్నీవాసు
అల్లు అర్జున్ సినిమాపై సినీ కార్మికుల సమ్మె ప్రభావం చూపుతోందని నిర్మాత బన్నీ వాసు అన్నారు. ప్రస్తుతం ముంబైలో అల్లు అర్జున్ హీరోగా, అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతోందని, అయితే కార్మికుల సమ్మె కారణంగా షూటింగ్లో జాప్యం జరిగిందని తెలిపారు. ఈ సమ్మె వల్ల ఇండస్ట్రీకి తీవ్ర నష్టం కలుగుతుందని, సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆయన కోరారు.
-
గుడ్న్యూస్ చెప్పిన పరిణీతి, రాఘవ్ చద్దా
ఆమ్ఆద్మీ పార్టీ ఎంపీ రాఘవ్ చద్దా, బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా దంపతులు తమ అభిమానులకు గుడ్న్యూస్ చెప్పారు. త్వరలోనే తమ ఇంట్లోకి పండంటి బిడ్డ రాబోతోందని సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. ఇరువురూ చేతులు పట్టుకొని నడుస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘మా చిన్ని ప్రపంచం.. త్వరలో మా జీవితాల్లోకి రాబోతోంది’అంటూ రాసుకొచ్చారు. ఇటీవల వీరు పాల్గొన్న కపిల్ షోలో మాట్లాడుతూ.. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామని క్లూ ఇచ్చారు.