Locations: Hyderabad

  • హైదరాబాద్‌లో పెరుగుతున్న శబ్ద కాలుష్యం

    హైదరాబాద్‌ నగరంలో రాత్రిపూట శబ్ద కాలుష్యం పెరుగుతోందని,ఇది ప్రజల ఆరోగ్యానికి హానికరమని నిపుణులు చెబుతున్నారు. భారీ హారన్‌లు, సైలెన్సర్‌లు, ట్రావెల్ బస్సుల శబ్దాలే దీనికి ప్రధాన కారణాలు. దీంతో వినికిడి లోపం, ఏకాగ్రత దెబ్బతినడం, రక్తపోటు వంటి సమస్యలు వస్తాయి. ఈకాలుష్యాన్ని నియంత్రించేందుకు స్వీయ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. రాత్రిపూట శబ్దాలు 40 డెసిబుళ్ల కన్నా తక్కువ ఉండాలని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది.

  • బైకుపై వెళ్తుండగా.. కరెంటు స్తంభం విరిగి పడి వ్యక్తి మృతి

    మేడ్చల్: నాచారం పీఎస్ పరిధిలో కరెంట్ స్తంభం విరిగి బైక్‌పై వెళ్తున్న వ్యక్తిపై పడింది. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. తెల్లవారుజామున డివైడర్ మధ్యలో ఉన్న కరెంట్ స్తంభం అకస్మాత్తుగా విరిగి పడటంతో ఈ ప్రమాదం జరిగింది. మృతుడు కార్తికేయనగర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సాత్విక్‌గా పోలీసులు గుర్తించారు. కేసు నమోదు చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

  • అచ్చం ముత్యం పొదిగినట్టే.. సందర్శకులను ఆకట్టుకుంటూ..

    హైదరాబాద్ అంటే ఎవరికైనా ఠక్కున గుర్తొచ్చేది చార్మినర్.. అలాంటి చార్మినార్‌ అంటేనే ముత్యాలకు ప్రసిద్ధి. నగర సుందరీకరణలో భాగంగా మదీనా కూడలిలో ముత్యం పొదిగినట్టు ఏర్పాటు చేసిన ఈ ఆకృతి సందర్శకులను ఆకట్టుకుంటోంది.

  • HYDలో గణేశ్‌ నిమజ్జనానికి సర్వం సిద్ధం

    హైదరాబాద్‌లో గణేశ్ నిమజ్జనం కోసం జీహెచ్‌ఎంసీ రూ. 54 కోట్లతో విస్తృత ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్‌తో పాటు 20 చెరువులు, 74 కృత్రిమ కొలనుల ఏర్పాటు చేసి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూస్తున్నారు. నిమజ్జనంలో 15 వేల మంది సిబ్బంది విధుల్లో ఉండనున్నారు. ట్యాంక్‌బండ్‌ పరిసరాల్లో నిమజ్జన సందడి కొనసాగుతుండగా.. వ్యర్థాల తరలింపునకు 125 జేసీబీలు, 102 మినీ టిప్పర్లను ఉపయోగిస్తున్నారు.

     

     

  • తెలంగాణలో మరో 3రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు

    తెలంగాణలో మరో 3రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. కొత్తగూడెం, జగిత్యాల, హన్మకొండ, కరీంనగర్, ఖమ్మం, ములుగు, వరంగల్ వంటి జిల్లాలకు ఈ వర్షాల ప్రభావం ఎక్కువగా ఉంటుందని పేర్కొంది. ఇప్పటికే వరదల కారణంగా తీవ్రనష్టం జరిగింది. ఇప్పుడు మరోసారి భారీవర్షాలు వస్తుండటంతో, వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

  • ప్రియుడు కోసం కుటుంబాన్ని కాదన్నదని దారుణం

    HYD: జగద్గిరిగుట్టలో సోషల్ మీడియా కారణంగా ఓ కుటుంబంలో విషాదం చోటుచేసుకుంది. 13ఏళ్లక్రితం పెళ్లయిన కల్యాణి(33)కి ఇన్‌స్టాలో కర్నూలుకు చెందిన ఓ వ్యక్తితో పరిచయం ప్రేమగామారింది. ప్రియుడి కోసం భర్త శ్రీధర్(34)కు విడాకులు ఇస్తానని చెప్పడంతో ఇద్దరిమధ్య గొడవ జరిగింది. ఈక్రమంలో శ్రీధర్ కోపంతో కత్తితో కల్యాణి గొంతు, ముఖం, చేతులపై దాడిచేసి..అనంతరం తానూ చేతులు కోసుకున్నాడు. వీరికి ఇద్దరు కుమారులు కలరు.

  • పూడికతీతపై హైడ్రా నిఘా.. తనిఖీ చేయాలని సర్కార్ ఆదేశం

    హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన నాలాల పూడికతీత పనులను తనిఖీ చేయాలని రాష్ట్ర పురపాలకశాఖ కార్యదర్శి ఇలంబర్తి హైడ్రాను ఆదేశించారు. భారీ వర్షాలతో అమీర్‌పేట్, మైత్రివనం ప్రాంతాల్లో పలు బస్తీలు ఇటీవల నీట మునిగాయి. షేక్‌పేట్, తదితర చోట్ల కాలనీలు మోకాల్లోతు నీటిలో చిక్కుకున్నాయి. ఈనేపథ్యంలో పూడికతీత పనుల వివరాలను హైడ్రాకు అందించాలని జీహెచ్‌ఎంసీని సర్కారు ఆదేశించింది.

  • పదకొండు దాటినా.. పత్తా లేని అధికారులు..

    HYD: అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో అధికారులు సమయపాలన పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య అధికారులు కమిషనర్, ఆర్వో, మేనేజర్లతో సహా ఎవరూ సమయానికి కార్యాలయానికి రావడం లేదని తెలుస్తోంది. ఫీల్డ్ విజిట్ పేరిట విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే మూవ్‌మెంట్ రిజిస్టర్ కూడా లేదని సిబ్బంది సమాధానం ఇచ్చారు. కలెక్టర్ విచారణ జరిపితే, నిజాలు బయటపడతాయని ప్రజలు భావిస్తున్నారు.

  • చెరువుల పునరుద్ధరణపై HYDRAA ప్రణాళిక

    హైదరాబాద్ రివైవల్ అండ్ రిక్రియేషన్ అసోసియేషన్(HYDRAA) నగరంలోని చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మొదటి దశను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా, కాలుష్యానికి గురైన జల వనరులను శుద్ధి చేసి వాటిని పునరుజ్జీవింపజేయడంపై దృష్టి సారించారు. ఈ కార్యక్రమం నగరంలోని పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

  • ఫెస్టివల్స్ ఎఫెక్ట్.. చర్లపల్లి-తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్స్!

    HYD: పండుగల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం కోసం చర్లపల్లి, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈరైలు సేవలు సెప్టెంబర్ 9 నుండి నవంబర్ 26 వరకు అందుబాటులో ఉంటాయి. రైలు నెం.07013 ప్రతి మంగళవారం చర్లపల్లి నుండి బయలుదేరి బుధవారం తిరుపతి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో రైలు నెం.07014 ప్రతి బుధవారం తిరుపతి నుండి బయలుదేరుతుంది. ఈరైలు నల్గొండ, మిర్యాలగూడ వంటి కీలక స్టేషన్లలో ఆగుతుంది.