Locations: Hyderabad

  • పూడికతీతపై హైడ్రా నిఘా.. తనిఖీ చేయాలని సర్కార్ ఆదేశం

    హైదరాబాద్‌: జీహెచ్‌ఎంసీ ఆధ్వర్యంలో జరిగిన నాలాల పూడికతీత పనులను తనిఖీ చేయాలని రాష్ట్ర పురపాలకశాఖ కార్యదర్శి ఇలంబర్తి హైడ్రాను ఆదేశించారు. భారీ వర్షాలతో అమీర్‌పేట్, మైత్రివనం ప్రాంతాల్లో పలు బస్తీలు ఇటీవల నీట మునిగాయి. షేక్‌పేట్, తదితర చోట్ల కాలనీలు మోకాల్లోతు నీటిలో చిక్కుకున్నాయి. ఈనేపథ్యంలో పూడికతీత పనుల వివరాలను హైడ్రాకు అందించాలని జీహెచ్‌ఎంసీని సర్కారు ఆదేశించింది.

  • పదకొండు దాటినా.. పత్తా లేని అధికారులు..

    HYD: అమీన్‌పూర్‌ మున్సిపాలిటీలో అధికారులు సమయపాలన పాటించడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్య అధికారులు కమిషనర్, ఆర్వో, మేనేజర్లతో సహా ఎవరూ సమయానికి కార్యాలయానికి రావడం లేదని తెలుస్తోంది. ఫీల్డ్ విజిట్ పేరిట విధులను నిర్లక్ష్యం చేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. దీనిపై ప్రశ్నిస్తే మూవ్‌మెంట్ రిజిస్టర్ కూడా లేదని సిబ్బంది సమాధానం ఇచ్చారు. కలెక్టర్ విచారణ జరిపితే, నిజాలు బయటపడతాయని ప్రజలు భావిస్తున్నారు.

  • చెరువుల పునరుద్ధరణపై HYDRAA ప్రణాళిక

    హైదరాబాద్ రివైవల్ అండ్ రిక్రియేషన్ అసోసియేషన్(HYDRAA) నగరంలోని చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం మొదటి దశను ఈ సంవత్సరం చివరి నాటికి పూర్తి చేయడానికి ప్రయత్నిస్తోంది. ఈ ప్రణాళికలో భాగంగా, కాలుష్యానికి గురైన జల వనరులను శుద్ధి చేసి వాటిని పునరుజ్జీవింపజేయడంపై దృష్టి సారించారు. ఈ కార్యక్రమం నగరంలోని పర్యావరణ సమతుల్యతను కాపాడటంలో కీలక పాత్ర పోషిస్తుందని అధికారులు పేర్కొన్నారు.

  • ఫెస్టివల్స్ ఎఫెక్ట్.. చర్లపల్లి-తిరుపతి మధ్య స్పెషల్ ట్రైన్స్!

    HYD: పండుగల నేపథ్యంలో ప్రయాణికుల సౌకర్యం కోసం చర్లపల్లి, తిరుపతి మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతున్నారు. ఈరైలు సేవలు సెప్టెంబర్ 9 నుండి నవంబర్ 26 వరకు అందుబాటులో ఉంటాయి. రైలు నెం.07013 ప్రతి మంగళవారం చర్లపల్లి నుండి బయలుదేరి బుధవారం తిరుపతి చేరుకుంటుంది. తిరుగుప్రయాణంలో రైలు నెం.07014 ప్రతి బుధవారం తిరుపతి నుండి బయలుదేరుతుంది. ఈరైలు నల్గొండ, మిర్యాలగూడ వంటి కీలక స్టేషన్లలో ఆగుతుంది.

  • గణేశ్ ఉత్సవాలు.. పోలీసులు ఫ్లాగ్ మార్చ్

    HYD:గణేష్ ఉత్సవాల నేపథ్యంలో సౌత్ జోన్ పోలీసులు ఛత్రినాక డివిజన్‌లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్(RAF)తో కలిసి ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. ఈసందర్భంగా డీసీపీ మాట్లాడుతూ..గణేష్ మండపాల నిర్వాహకులు ఊరేగింపులను త్వరగా ముగించాలని కోరారు. అలాగే, అధికశబ్దాలతో కూడిన సంగీతం(లౌడ్ మ్యూజిక్) వినియోగించవద్దని సూచించారు. నిమజ్జనం సమయంలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారని, ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలని కోరారు.

  • హైదరాబాద్‌లో ‘జల వనరుల సర్వే’

    హైదరాబాద్‌లోని చెరువులు, నాలాలు, ఇతర జల వనరుల ఆక్రమణలను నివారించడానికి జలవనరుల(LiDAR) సర్వే నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆదేశించారు. జల వనరులను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈఅత్యాధునిక సాంకేతికతతో సర్వే నిర్వహించడం ద్వారా ఆక్రమణల లెక్కలను ఖచ్చితంగా తెలుసుకోవచ్చని అన్నారు. ఈ చర్య హైదరాబాద్‌లోని జల వనరుల పరిరక్షణకు, భవిష్యత్తులో ఆక్రమణలు జరగకుండా నిరోధించడానికి ఉపయోగపడుతుంది.

  • HYDలో రోడ్ సేఫ్టీ డ్రైవ్‌.. 10,962 గుంతలు పూడ్చివేత

    HYD: జీహెచ్ఎంసీ యుద్ధ ప్రాతిపదికన రోడ్ సేఫ్టీ డ్రైవ్ కొనసాగిస్తుంది. సెప్టెంబర్ 1 వరకు 13,616 గుంతలు గుర్తించగా.. అందులో 10,962 పూడ్చేశారు. ఒక్కరోజులోనే 108 గుంతలు మరమ్మతయ్యాయి. ఇప్పటి వరకు 544 క్యాచ్పిట్స్ రిపేర్లు, 311 కవర్ రీప్లేస్మెంట్లు, 12 సెంట్రల్ మీడియన్ పనులు పూర్తయ్యాయి. జోన్ల వారీగా మరమ్మతులు వేగంగా జరుగుతున్నాయని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తక్షణం పనులు పూర్తి చేయాలని కమిషనర్ ఆదేశించారు.

  • యూరాల‌జీ స‌ర్జ‌రీల్లో రోబోల యుగం

    హైదరాబాద్‌లోని ఏషియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ నెఫ్రాలజీ అండ్‌ యూరాలజీ(AINU) ఆధ్వర్యంలో ‘రోబో-ల్యాప్ 2025’ సదస్సు జరిగింది. ఈ సదస్సులో యూరాలజీలో రోబోటిక్, లాప్రోస్కోపిక్ శస్త్రచికిత్సల ప్రాధాన్యత గురించి చర్చించారు. అమెరికా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్ వంటి దేశాల నుంచి వెయ్యి మందికి పైగా వైద్య నిపుణులు హాజరయ్యారు. రోబోటిక్ సర్జరీలతో కోత తక్కువగా ఉంటుందని, రోగులకు తక్కువ ఇబ్బంది ఉంటుందని నిపుణులు తెలిపారు.

  • నిమజ్జనోత్సవం విషాదాంతం.. వేర్వేరు ప్రాంతాల్లో ముగ్గురు మృతి

    HYD: వినాయకుడిని నిమజ్జనం చేసే క్రమంలో మహానగరంలో విషాదం చోటుచేసుకుంది. స్థానిక నాగులూరు పెద్దచెరువులో ప్రమాదవశాత్తు ఆటో పడిపోవడంతో డొక్క శ్రీనివాస్(34), అతని ఏడేళ్ల కుమారుడు జాన్ వెస్లీ మరణించారు. వినాయకుడిని నిమజ్జనం చేసి తిరిగి వస్తుండగా, చెరువు కట్టపై ఆటో అదుపు తప్పి నీటిలో పడిపోయింది. రాజేంద్రనగర్ పరిధిలో గణేష్ నిమజ్జనం కోసం హిమాయత్‌సాగర్‌కు వచ్చిన సాయికుమార్(28)  ప్రమాదవశాత్తు నీటిలో పడి మరణించాడు.

  • మధ్యాహ్నాం 1గంట వరకు ఆ ప్రాంతాల్లో పవర్ కట్!

    హైదరాబాద్: గ్రీన్‌ల్యాండ్స్‌ ఏడీఈ పరిధిలోని పలుప్రాంతాల్లో గురువారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఏడీఈ పి.వంశీకృష్ణ తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1గంటవరకు 11కేవీ అమీర్‌పేట, ఆదిత్య ఎన్‌క్లేవ్‌ ఫీడర్ల పరిధిలోని ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌, కాకతీయ మెస్‌, అమీర్‌పేట్‌, దుర్గానగర్‌, ఆదిత్య బ్లాక్‌, వింధ్యబ్లాక్‌, కుమ్మరి బస్తీ, ఇమ్రోజ్‌ హోటల్‌, ఆనంద్‌బజార్‌, డెల్టా చాంబర్స్‌ ప్రాంతాల్లో విద్యుత్‌ అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు.